నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- July 18, 2026
మస్కట్: సముద్రంలో చిక్కుకుపోయిన లేదా దీర్ఘకాలంగా నిలిపివేసిన కొన్ని నౌకలను 30 రోజుల్లోగా తొలగించాలని వాటి యజమానులకు ఒమన్ రవాణా, కమ్యూనికేషన్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) ఆదేశాలు జారీ చేసింది.
అల్ సువైక్ విలాయత్ తీరంలోని అల్ జౌద్ ప్రాంతంలో చిక్కుకుపోయిన సీ లైట్ ( SEA LIGHT) నౌకతో పాటు, సూర్ విలాయత్ లోని ఖోర్ అల్-బతా వద్ద చెక్క పడవల నిర్మాణ కేంద్రం సమీపంలో నిలిపివేసిన ఇతర నౌకలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయిని స్పష్టం చేసింది.
నిర్దేశించిన 30 రోజుల గడువులోగా సంబంధిత నౌకలను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తొలగించాలని మంత్రిత్వ శాఖ యజమానులను కోరింది. ఈ గడువులోగా నౌకలను తొలగించకపోతే, ఒమన్ సముద్ర చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
సముద్ర భద్రతను మెరుగుపరచడం, తీర ప్రాంత పర్యావరణాన్ని పరిరక్షించడం, నౌకాశ్రయాలు మరియు సముద్ర రాకపోకలను సక్రమంగా నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







