నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్‌..!!

- July 18, 2026 , by Maagulf
నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్‌..!!

మస్కట్: సముద్రంలో చిక్కుకుపోయిన లేదా దీర్ఘకాలంగా నిలిపివేసిన కొన్ని నౌకలను 30 రోజుల్లోగా తొలగించాలని వాటి యజమానులకు ఒమన్ రవాణా, కమ్యూనికేషన్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) ఆదేశాలు జారీ చేసింది.

అల్ సువైక్ విలాయత్ తీరంలోని అల్ జౌద్ ప్రాంతంలో చిక్కుకుపోయిన సీ లైట్ ( SEA LIGHT) నౌకతో పాటు, సూర్ విలాయత్ ‌లోని ఖోర్ అల్-బతా వద్ద చెక్క పడవల నిర్మాణ కేంద్రం సమీపంలో నిలిపివేసిన ఇతర నౌకలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయిని స్పష్టం చేసింది.

నిర్దేశించిన 30 రోజుల గడువులోగా సంబంధిత నౌకలను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తొలగించాలని మంత్రిత్వ శాఖ యజమానులను కోరింది. ఈ గడువులోగా నౌకలను తొలగించకపోతే, ఒమన్ సముద్ర చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

సముద్ర భద్రతను మెరుగుపరచడం, తీర ప్రాంత పర్యావరణాన్ని పరిరక్షించడం, నౌకాశ్రయాలు మరియు సముద్ర రాకపోకలను సక్రమంగా నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com