నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- July 18, 2026
మస్కట్: సముద్రంలో చిక్కుకుపోయిన లేదా దీర్ఘకాలంగా నిలిపివేసిన కొన్ని నౌకలను 30 రోజుల్లోగా తొలగించాలని వాటి యజమానులకు ఒమన్ రవాణా, కమ్యూనికేషన్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) ఆదేశాలు జారీ చేసింది.
అల్ సువైక్ విలాయత్ తీరంలోని అల్ జౌద్ ప్రాంతంలో చిక్కుకుపోయిన సీ లైట్ ( SEA LIGHT) నౌకతో పాటు, సూర్ విలాయత్ లోని ఖోర్ అల్-బతా వద్ద చెక్క పడవల నిర్మాణ కేంద్రం సమీపంలో నిలిపివేసిన ఇతర నౌకలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయిని స్పష్టం చేసింది.
నిర్దేశించిన 30 రోజుల గడువులోగా సంబంధిత నౌకలను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తొలగించాలని మంత్రిత్వ శాఖ యజమానులను కోరింది. ఈ గడువులోగా నౌకలను తొలగించకపోతే, ఒమన్ సముద్ర చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
సముద్ర భద్రతను మెరుగుపరచడం, తీర ప్రాంత పర్యావరణాన్ని పరిరక్షించడం, నౌకాశ్రయాలు మరియు సముద్ర రాకపోకలను సక్రమంగా నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







