త్వరలో మవసలాత్ ట్యాక్సీ ప్రారంభం
- November 22, 2017
మస్కట్: నేషనల్ బస్ ఆపరేటర్మవసలాత్, ట్యాక్సీ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ట్యాక్సీ ఆపరేషన్స్కి సంబంధించి తగిన సూచనలు, సలహాలు ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో మవసలాత్ పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి మవసలాత్, మర్హాబా ట్యాక్సీ లైసెన్సుల్ని పొందాయి. మవసలాత్ ట్యాక్సీ రంగంలోకి వస్తూనే, ఎయిర్పోర్ట్ ఛార్జీలను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. జిసిసి దేశాల్లోనే ఒమనీ క్యాపిటల్ వద్ద ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. 6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమై, గంటకు 200 బైసాస్గా ఉంటున్నాయి. ఇదే జిసిసిలోని ఇతర దేశాల్లో అయితే 3 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. మోడ్రన్ ట్యాక్సీల్లో వుండే అన్ని అత్యాధునిక సౌకర్యాలూ తమ ట్యాక్సీల్లో ఉంటాయని మవసలాత్ పేర్కొంది.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







