విజయవంతమైన వైద్య పరీక్షల అనంతరం అమీర్ ఆసుపత్రి నుంచి విడుదల
- November 23, 2017కువైట్: విజయవంతమైన వైద్య పరీక్షల అనంతరం అమీర్ షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్ ఆసుపత్రి నుండి విడుదలయ్యారని అమిరి దివాన్ వ్యవహారాల మంత్రి షేక్ నస్సెర్ సబాహ్ అల్ అహ్మద్ అల్ సబాహ్ తెలిపారు. ఆయనకు తీవ్రమైన జలుబు చేయడం ఛాతి సంబంధిత పరీక్షల నిమిత్తం ఒక రోజు ముందుగా ఆయన ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షలు ఆయనకు జరిగినట్లు షేక్ నస్సెర్ సబాహ్ అల్ అహ్మద్ అల్ సబాహ్ నాసర్ బుధవారం ప్రకటించారు. ఈ సమయంలో, ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాః అతని హైనేస్ ది అమీర్ కు విజయవంతమైన వైద్య పరీక్షలు జరగడం పట్ల ప్రత్యేకంగా అభినందించాడు. క్రౌన్ ప్రిన్స్ శ్రీ అమిర్ కు మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును కోరుకున్నారు, తద్వారా ఆయన దేశంలో అభివృద్ధిని కొనసాగిస్తుండాలని ఆకాంక్షించారు.. అంతేకాక బుధవారం ఎమిర్ గొప్పతనాన్ని కీర్తిస్తూ పాలస్తీనా ప్రెసిడెంట్ మహమౌద్ అబ్బాస్ నుండి ఒక ఫోన్ కాల్ అందుకున్నాడు, ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి సాధారణ వైద్య పరీక్షలు జరపిన తరువాత అమీర్ ఆరోగ్య స్థితి మెరుగవడంతో భగవంతునికి ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను కలిగి ఉంది. బుధవారం, శ్రీ అమీర్ ఆరోగ్య పరిస్థితుల గురించి పలువురు అరబ్ నాయకుల నుండి ఫోన్ కాల్స్ అందుకొన్నారు. సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్జిజ్ అల్ సౌద్ అమీర్ ఆరోగ్యం గూర్చి వాకబు చేశారు. వైద్య పరీక్షల తర్వాత ఎమిర్ మరింత ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి