రిస్క్ చేసిన బన్నీ
- November 26, 2017
వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు. ఇప్పుడా సీన్స్ అద్భుతంగా వచ్చాయని దర్శకుడు వంశీ మురిసిపోతున్నాడు. ఇదంతా బన్నీ క్రెడిట్ నే అంటున్నాడు. ఎందుకంటే.. ఆ యాక్షన్ ఏపీసోడ్స్ చాలా రిస్క్ తో కూడుకొన్నవి అట. వాటిని బన్నీ ఎలాంటి డూప్ లేకుండా చేశాడట. వాటిని తెరపై చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి గురవుతారని చెప్పుకొంటున్నాడు.
దర్శకుడు వక్కంతం వంశీకి ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అను నేను' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో స్టయిలీష్ స్టార్, సూపర్ స్టార్ ల బాక్సీఫీసు ఫైట్ ని ఆరోజు చూడొచ్చన్న మాట.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







