అత్యున్నత పురస్కారంకు ఎంపికైనా బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ
- November 26, 2017
మనామా : దుబాయ్ వార్షిక వారీగా ఇచ్చే కామ్స్ ఎం ఇ ఎ అవార్డు12 వ ఎడిషన్ లో 2017 కు సంబంధించి "రెగ్యులేటరీ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్" అవార్డుకు బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) ఎంపికయింది. ఈ అవార్డును కామ్స్ ఎం ఇ ఎ మార్గదర్శకాల ప్రకారం ఒక ఆరోగ్యకరమైన, సురక్షితమైన పోటీతత్వ విఫణిని అభివృద్ధి చేయడంలో అధికార ప్రయత్నాలు రాజ్యంలో నెలకొల్పబడి ఉండాలి. ట్రా యూఏఈ, ట్రా ఒమన్ మరియు సి ఐ టి సి సౌదీ అరేబియాతో సహా ఈ ప్రాంతంలోని ప్రఖ్యాత ప్రత్యర్థులైన పోటీదారులను అధిగమించి బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఈ పురస్కారంను గెలుచుకుంది. ట్రా యొక్క సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ డాక్టర్ ఖాలిద్ బిన్ తైజై అల్-ఖలీఫా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఒక ముఖ్యమైన చొరవను సాధించడానికి శ్రద్ధగా పనిచేసిన ట్రా సిబ్బంది ప్రయత్నాలను ఆయన అభినందిస్తూ, ఈ పురస్కారం పొందడం ద్వారా సి టి ఐ రిస్క్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్ బహ్రెయిన్ కోసం ఒక ప్రధాన అడుగు అని ఆయన సూచించారు,ఇటువంటి చట్టం దేశంలో గాని లేదా మరో ప్రాంతంలో గాని గతంలో ఉనికిలో లేదు. క్లిష్టమైన టెలీకమ్యూనికేషన్ల మౌలిక సదుపాయాలపై నష్టాలను సమగ్రంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన నియమనిబంధనలు అమలుపర్చడం ద్వారా దేశంలోని అనుసంధానిత భవిష్యత్ వైపు కొనసాగించేందుకు మరియు టెలికాం మెరుగైన సేవలను పునరుద్ధరించుకునేందుకు ఈ నిబంధనలను రూపొందించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







