అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
- December 06, 2017
పై చదువుల కోసం ఎంతో సంతోషంతో అమెరికాకు వెళ్లిన ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. కుత్భుల్లాపూర్ సూరారంకు చెందిన నాగ తులసీరామ్(26) మంగళవారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తులసీరామ్ను ఓ మహిళ కారుతో ఢీకొట్టింది. ఈ ఘటనలో తులసీరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రిడ్జిపోర్టు యూనివర్సిటీలో నాగ తులసీరామ్ ఎంఎస్ చదువుతున్నాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. పిల్లల చిన్నతనంలోనే నాగ తులసీరామ్ తల్లి మృతిచెందింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







