పార్కింగ్ చేసిన కారులో చనిపోయిన వ్యక్తి గుర్తింపు
- December 09, 2017
మనామ: బహ్రెయిన్ లో పార్కింగ్ చేయబడిన ఒక కారులో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు.బిలాడ్ ఆల్ ఖదీం మసీదు పక్కన నిలిపి ఉన్న ఒక కారులో చనిపోయిన వ్యక్తి హుస్సేన్ అలీ మహ్మద్ గా గుర్తించబడ్డాడు. మృతుడు మమమా నివాసిగా గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతకుముందు ఆయన బిలాడ్ అల్ ఖదీమ్ నివాసితులు. ఎటువంటి కదలిక లేకుండా కారులో నిర్జీవంగా ఉండిన స్థితిలోకనుగొన్నకొంతమంది ఆ వ్యక్తి ఏవైనా మత్తులో మునిగివున్నాడేమోనని తొలుత అనుమానించినట్లు వారు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి మృతికి దీనికి సంబంధించిన అధికారిక నిర్ధారణ ఏదీ అందుబాటులో లేదు. ఈ సంఘటన గూర్చి అంతర్గత వ్యవహారాల శాఖ సైతం ఏ విషయం ఇంకా నిర్ధారించలేదు. సమీపంలోని ఒక రెస్టారెంట్ సి.సి.టి.వి ఫుటేజ్ నుండి పోలీసులు చనిపోయిన ఆ వ్యక్తి అక్కడే ఉంచారని కనుగొన్నారు. ఫుటేజ్ ప్రకారం, మంగళవారం రాత్రి 9.58 గంటలకు ఆ కారును పార్కింగ్ స్థలంలో ఉంచినట్లు తేలింది. రెస్టారెంట్ యజమాని ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కడ కారు పార్కింగ్ చేసిన వ్యక్తిని గమనించినట్లు అయితే ఆయన ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించలేదని తెలిపారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు