పార్కింగ్ చేసిన కారులో చనిపోయిన వ్యక్తి గుర్తింపు
- December 09, 2017
మనామ: బహ్రెయిన్ లో పార్కింగ్ చేయబడిన ఒక కారులో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు.బిలాడ్ ఆల్ ఖదీం మసీదు పక్కన నిలిపి ఉన్న ఒక కారులో చనిపోయిన వ్యక్తి హుస్సేన్ అలీ మహ్మద్ గా గుర్తించబడ్డాడు. మృతుడు మమమా నివాసిగా గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతకుముందు ఆయన బిలాడ్ అల్ ఖదీమ్ నివాసితులు. ఎటువంటి కదలిక లేకుండా కారులో నిర్జీవంగా ఉండిన స్థితిలోకనుగొన్నకొంతమంది ఆ వ్యక్తి ఏవైనా మత్తులో మునిగివున్నాడేమోనని తొలుత అనుమానించినట్లు వారు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి మృతికి దీనికి సంబంధించిన అధికారిక నిర్ధారణ ఏదీ అందుబాటులో లేదు. ఈ సంఘటన గూర్చి అంతర్గత వ్యవహారాల శాఖ సైతం ఏ విషయం ఇంకా నిర్ధారించలేదు. సమీపంలోని ఒక రెస్టారెంట్ సి.సి.టి.వి ఫుటేజ్ నుండి పోలీసులు చనిపోయిన ఆ వ్యక్తి అక్కడే ఉంచారని కనుగొన్నారు. ఫుటేజ్ ప్రకారం, మంగళవారం రాత్రి 9.58 గంటలకు ఆ కారును పార్కింగ్ స్థలంలో ఉంచినట్లు తేలింది. రెస్టారెంట్ యజమాని ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కడ కారు పార్కింగ్ చేసిన వ్యక్తిని గమనించినట్లు అయితే ఆయన ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించలేదని తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







