పార్కింగ్ చేసిన కారులో చనిపోయిన వ్యక్తి గుర్తింపు
- December 09, 2017
మనామ: బహ్రెయిన్ లో పార్కింగ్ చేయబడిన ఒక కారులో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు.బిలాడ్ ఆల్ ఖదీం మసీదు పక్కన నిలిపి ఉన్న ఒక కారులో చనిపోయిన వ్యక్తి హుస్సేన్ అలీ మహ్మద్ గా గుర్తించబడ్డాడు. మృతుడు మమమా నివాసిగా గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతకుముందు ఆయన బిలాడ్ అల్ ఖదీమ్ నివాసితులు. ఎటువంటి కదలిక లేకుండా కారులో నిర్జీవంగా ఉండిన స్థితిలోకనుగొన్నకొంతమంది ఆ వ్యక్తి ఏవైనా మత్తులో మునిగివున్నాడేమోనని తొలుత అనుమానించినట్లు వారు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి మృతికి దీనికి సంబంధించిన అధికారిక నిర్ధారణ ఏదీ అందుబాటులో లేదు. ఈ సంఘటన గూర్చి అంతర్గత వ్యవహారాల శాఖ సైతం ఏ విషయం ఇంకా నిర్ధారించలేదు. సమీపంలోని ఒక రెస్టారెంట్ సి.సి.టి.వి ఫుటేజ్ నుండి పోలీసులు చనిపోయిన ఆ వ్యక్తి అక్కడే ఉంచారని కనుగొన్నారు. ఫుటేజ్ ప్రకారం, మంగళవారం రాత్రి 9.58 గంటలకు ఆ కారును పార్కింగ్ స్థలంలో ఉంచినట్లు తేలింది. రెస్టారెంట్ యజమాని ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కడ కారు పార్కింగ్ చేసిన వ్యక్తిని గమనించినట్లు అయితే ఆయన ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించలేదని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







