శ్రీనివాస్ కూచిభొట్లను కాపాడబోయిన గ్రిల్లోట్కి లభించిన గౌరవం
- December 11, 2017
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగిన కాన్సాస్ కాల్పుల్లో భారతీయులను కాపాడబోయిన ఇయాన్ గ్రిల్లోట్కి అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ ప్రతిఏటా ప్రకటించే సాహసవీరుల జాబితాలో ఆయన పేరును కూడా ప్రకటించింది. ''2017లో మనలో ఆశలు నింపిన 5గురు హీరోలు'' అంటూ టైమ్ మ్యాగజైన్ ఈ జాబితా విడుదల చేసింది. భారత యువకులు శ్రీనివాస్ కూచిభొట్ల, ఆయన స్నేహితుడు అలోక్ మాదసానిపై ఓ మాజీ నేవీ ఉద్యోగి కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శ్రీనివాస్ మృతిచెందగా.. అలోక్ ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్పులకు తెగబడిన ఉన్మాదిని అడ్డుకునేందుకు 24 ఏళ్ల అమెరికా యువకుడు గ్రిల్లోట్ ప్రాణాలకు తెగించాడు. ఈ క్రమంలో అతడి చాతీలోకి ఓ బుల్లెట్ కూడా దూసుకెళ్లింది. ''అక్కడ నేనేమీ చేయకుండా ఉండిఉంటే... నేను నేనుగా బ్రతకలేకపోయేవాడిని..'' అని గ్రిల్లోట్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







