శ్రీనివాస్ కూచిభొట్లను కాపాడబోయిన గ్రిల్లోట్కి లభించిన గౌరవం
- December 11, 2017
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగిన కాన్సాస్ కాల్పుల్లో భారతీయులను కాపాడబోయిన ఇయాన్ గ్రిల్లోట్కి అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ ప్రతిఏటా ప్రకటించే సాహసవీరుల జాబితాలో ఆయన పేరును కూడా ప్రకటించింది. ''2017లో మనలో ఆశలు నింపిన 5గురు హీరోలు'' అంటూ టైమ్ మ్యాగజైన్ ఈ జాబితా విడుదల చేసింది. భారత యువకులు శ్రీనివాస్ కూచిభొట్ల, ఆయన స్నేహితుడు అలోక్ మాదసానిపై ఓ మాజీ నేవీ ఉద్యోగి కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శ్రీనివాస్ మృతిచెందగా.. అలోక్ ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్పులకు తెగబడిన ఉన్మాదిని అడ్డుకునేందుకు 24 ఏళ్ల అమెరికా యువకుడు గ్రిల్లోట్ ప్రాణాలకు తెగించాడు. ఈ క్రమంలో అతడి చాతీలోకి ఓ బుల్లెట్ కూడా దూసుకెళ్లింది. ''అక్కడ నేనేమీ చేయకుండా ఉండిఉంటే... నేను నేనుగా బ్రతకలేకపోయేవాడిని..'' అని గ్రిల్లోట్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







