12 ఏళ్ల పిల్లాడు.. ప్రమాదాన్ని పసిగట్టాడు.. వందల మందిని కాపాడాడు
- December 20, 2017
ఆకతాయి పిల్లాడు.. ఆడుకుంటూ రైల్వే ట్రాక్పైకి వెళ్లాడు... వాడు కూడా అనుకుని ఉండడు. నేను కూడా ఇంత మందిని కాపాడగలనని.. 12 ఏళ్ల ఆ బాలుడు రైలు ప్రమాదాన్నిముందుగానే పసిగట్టాడు. వందల మంది ప్రయాణీకుల ప్రాణాల్ని కాపాడాడు.
ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. భీమ్ (12) అనే బాలుడు రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒకచోట అతడికి రైలు పట్టా విరిగినట్లుగా కనిపించింది. ఆ చిన్ని హృదయం ఎందుకో రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి గేట్మెన్కి ఈ విషయాన్ని చెప్పాడు. స్పందించిన గేట్మెన్.. స్టేషన్ మాస్టర్కి విషయాన్ని వివరించి ఆ సమయానికి వస్తున్న రైలుని నిలిపివేశారు. సరిగ్గా అదే సమయంలో గోరక్పూర్-నర్కాటియగంజ్ లోకల్ వస్తోందని, మరో 15 నిమిషాల్లో అది అక్కడకు చేరుకునేదని తెలియజేశారు. అయితే ఆ బాలుడు ఈ విషయాన్ని పసిగట్టి తెలియజేయడంతో వెంటనే అప్రమత్తమై ఘోర ప్రమాదాన్ని నివారించగలిగామని అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అందరి ప్రాణాలను కాపాడిని ఆ బాలుడికి చదువు నిమిత్తంగా సాయం చేస్తామంటున్నారు.
తాజా వార్తలు
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన







