12 ఏళ్ల పిల్లాడు.. ప్రమాదాన్ని పసిగట్టాడు.. వందల మందిని కాపాడాడు
- December 20, 2017
ఆకతాయి పిల్లాడు.. ఆడుకుంటూ రైల్వే ట్రాక్పైకి వెళ్లాడు... వాడు కూడా అనుకుని ఉండడు. నేను కూడా ఇంత మందిని కాపాడగలనని.. 12 ఏళ్ల ఆ బాలుడు రైలు ప్రమాదాన్నిముందుగానే పసిగట్టాడు. వందల మంది ప్రయాణీకుల ప్రాణాల్ని కాపాడాడు.
ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. భీమ్ (12) అనే బాలుడు రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒకచోట అతడికి రైలు పట్టా విరిగినట్లుగా కనిపించింది. ఆ చిన్ని హృదయం ఎందుకో రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి గేట్మెన్కి ఈ విషయాన్ని చెప్పాడు. స్పందించిన గేట్మెన్.. స్టేషన్ మాస్టర్కి విషయాన్ని వివరించి ఆ సమయానికి వస్తున్న రైలుని నిలిపివేశారు. సరిగ్గా అదే సమయంలో గోరక్పూర్-నర్కాటియగంజ్ లోకల్ వస్తోందని, మరో 15 నిమిషాల్లో అది అక్కడకు చేరుకునేదని తెలియజేశారు. అయితే ఆ బాలుడు ఈ విషయాన్ని పసిగట్టి తెలియజేయడంతో వెంటనే అప్రమత్తమై ఘోర ప్రమాదాన్ని నివారించగలిగామని అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అందరి ప్రాణాలను కాపాడిని ఆ బాలుడికి చదువు నిమిత్తంగా సాయం చేస్తామంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల