విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పెను సంచలనం
- December 20, 2017
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సొసైటీ ఎన్నికల్లో పెను సంచలనమే నమోదైంది. ప్రధాన పార్టీలు బోల్తా పడగా, వామపక్షాలు విజయం సాధించాయి. నగరపాలక సంస్థ కో ఆపరేటివ్ సంఘం ఎన్నికల్లో భిన్న ధృవాలు కలిసి పోటీ చేశాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నట్లు... టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. మొత్తం 11 మంది డైరెక్టర్లు ఉన్న వీఎంసీ సొసైటీకి రెండు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. లెఫ్ట్ పార్టీలు బలపరిచిన ప్రోగ్రెసివ్ అభ్యర్థులు సహా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ బలపరిచిన వారంతా బరిలో నిలిచారు. సొసైటీలో 1888 ఓట్లు ఉండగా, ఎన్నికల్లో 1561 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెస్సివ్ అభ్యర్థులు ఆరుగురు విజయం సాధించారు. అయితే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ కలిసికట్టుగా పోటీ చేయడమే ఓ వింత అయితే... మూకుమ్మడిగా ఓడిపోవడమూ అంతే ఆశ్చర్యంగా మారింది. బయటకు విమర్శలు చేసుకున్నా అంతర్గతంగా టీడీపీ, వైసీపీ నేతలంతా ఒకటే అని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







