విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పెను సంచలనం
- December 20, 2017
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సొసైటీ ఎన్నికల్లో పెను సంచలనమే నమోదైంది. ప్రధాన పార్టీలు బోల్తా పడగా, వామపక్షాలు విజయం సాధించాయి. నగరపాలక సంస్థ కో ఆపరేటివ్ సంఘం ఎన్నికల్లో భిన్న ధృవాలు కలిసి పోటీ చేశాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నట్లు... టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. మొత్తం 11 మంది డైరెక్టర్లు ఉన్న వీఎంసీ సొసైటీకి రెండు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. లెఫ్ట్ పార్టీలు బలపరిచిన ప్రోగ్రెసివ్ అభ్యర్థులు సహా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ బలపరిచిన వారంతా బరిలో నిలిచారు. సొసైటీలో 1888 ఓట్లు ఉండగా, ఎన్నికల్లో 1561 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెస్సివ్ అభ్యర్థులు ఆరుగురు విజయం సాధించారు. అయితే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ కలిసికట్టుగా పోటీ చేయడమే ఓ వింత అయితే... మూకుమ్మడిగా ఓడిపోవడమూ అంతే ఆశ్చర్యంగా మారింది. బయటకు విమర్శలు చేసుకున్నా అంతర్గతంగా టీడీపీ, వైసీపీ నేతలంతా ఒకటే అని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







