ఆర్మీ వెల్ఫేర్ కు రూ. 5 లక్షల అందజేయనున్న అర్చర్ జ్యోతి సురేఖ
- January 04, 2018కష్టపడి ఎదిగిన వ్యక్తి.. అవతలి వారి కష్టంలో ఉంటే ఆదుకోవాలి అనే ఆలోచన వస్తుంది.. ఎందుకంటే కష్టం బాధతెలుసు కనుక.. ఎంతో కష్టపడి పైకి వచ్చిన అర్చర్ జ్యోతి తన పెద్దమనసును చాటుకొన్నది. తనకు అర్జున అవార్డ్ తో పాటు వచ్చిన నగదు పురష్కారం రూ. 5 లక్షలను ఆర్మీ వెల్ఫేర్ కు అందజేయనున్నట్లు ఆమె తెలిపింది. ఆర్మీ వెల్ఫేర్ కు ఎందుకు ఇస్తున్నానంటే.. మన కోసం.. మనల్ని మన దేశాన్ని రక్షించడం కోసం.. అహర్నిశలు సరిహద్దుల్లో కాపలా ఉండి.. ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న ఆర్మీ వారికి ఇవ్వాలనే ఆలోచనవచ్చిందని జ్యోతి సురేఖ తెలిపారు. ప్రధాని మోడీ ఎప్పుడు ఆపాయింట్ మెంట్ ఇస్తే అప్పుడు ఈ చెక్ ను తాను అందజేస్తానని ఆమె చెప్పారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా మంది సహాయం చేశారని.. తనకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. ఉద్యోగం ఇస్తానని ప్రకటించింది అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. కాగా ఇప్పటికే అక్షయ్ కుమార్, సింధు, గౌతమ్ గంభీర్ వంటి వారు ఆర్మీ కుటుంబాలను ఆడుకోవడానికి ముందుకొచ్చారు అన్న సంగతి తెలిసిందే..
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు