ఆర్మీ వెల్ఫేర్ కు రూ. 5 లక్షల అందజేయనున్న అర్చర్ జ్యోతి సురేఖ

- January 04, 2018 , by Maagulf
ఆర్మీ వెల్ఫేర్ కు రూ. 5 లక్షల అందజేయనున్న అర్చర్ జ్యోతి సురేఖ

కష్టపడి ఎదిగిన వ్యక్తి.. అవతలి వారి కష్టంలో ఉంటే ఆదుకోవాలి అనే ఆలోచన వస్తుంది.. ఎందుకంటే కష్టం బాధతెలుసు కనుక.. ఎంతో కష్టపడి పైకి వచ్చిన అర్చర్ జ్యోతి తన పెద్దమనసును చాటుకొన్నది. తనకు అర్జున అవార్డ్ తో పాటు వచ్చిన నగదు పురష్కారం రూ. 5 లక్షలను ఆర్మీ వెల్ఫేర్ కు అందజేయనున్నట్లు ఆమె తెలిపింది. ఆర్మీ వెల్ఫేర్ కు ఎందుకు ఇస్తున్నానంటే.. మన కోసం.. మనల్ని మన దేశాన్ని రక్షించడం కోసం.. అహర్నిశలు సరిహద్దుల్లో కాపలా ఉండి.. ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న ఆర్మీ వారికి ఇవ్వాలనే ఆలోచనవచ్చిందని జ్యోతి సురేఖ తెలిపారు. ప్రధాని మోడీ ఎప్పుడు ఆపాయింట్ మెంట్ ఇస్తే అప్పుడు ఈ చెక్ ను తాను అందజేస్తానని ఆమె చెప్పారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా మంది సహాయం చేశారని.. తనకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. ఉద్యోగం ఇస్తానని ప్రకటించింది అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. కాగా ఇప్పటికే అక్షయ్ కుమార్, సింధు, గౌతమ్ గంభీర్ వంటి వారు ఆర్మీ కుటుంబాలను ఆడుకోవడానికి ముందుకొచ్చారు అన్న సంగతి తెలిసిందే..  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com