భారత్కు లెవల్-2 కేటాయించిన అమెరికా
- January 11, 2018
వాషింగ్టన్ : భారతదేశంలో విదేశీ పర్యాటకులు ప్రయాణించాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలని తాజా ప్రయాణ సలహా మండలి పేర్కొంది. భారత్తో పాటు దేశాలకు ఒక కొత్త ప్రయాణ సలహాలను యునైటెడ్ స్టేట్స్ జారీ చేసింది. ఇది వినియోగదారులకు స్నేహపూర్వకమవుతుందని పేర్కొన్నారు. దీనిలో నాలుగు స్థాయిలు ఉంటాయని, ఈ స్థాయిలలో భారత్ది లెవల్ -2 కాగా, పాకిస్తాన్ది లెవల్ -3 అని పేర్కొన్నారు. లెవల్ -1 అయితే ప్రయాణికులు సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని, లెవల్ -4 అయితే ప్రయాణం చేయవద్దని సూచించింది. ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలకు లెవల్ -4 కేటాయించింది. భారత్కు కేటాయించిన రెండవ లెవల్ అంటే హెచ్చరికలు, జాగ్రత్తలు పెరుగుతాయని సూచించింది. మూడవ లెవల్ అంటే ప్రయాణంపై పునరాలోచించుకోవాలని సూచనలు జారీ చేసినట్లు తెలిపింది. ఈ వ్యవస్థద్వారా ప్రతిదేశం ఒక ప్రయాణపు సలహాను కలిగి వుంటుందని, ఇది గతంలో వున్న సలహాలను భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా స్పష్టమైన, సమయానుకూలమైన , విశ్వసనీయమైన భద్రత, భద్రతా సమాచారాన్ని యుఎస్ పౌరులకు అందజేస్తుందని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. భారత్లో అత్యధికంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారాలు ఒకటని, దీంతో పర్యాటక ప్రదేశాలలో లైంగిక వేధింపులు, హింస వంటివి పెరుగుతున్నాయని కొత్త భారత ప్రయాణపు సలహాలలో పేర్కొంది. దీంతో భారత్కు లెవల్ 2ను కేటాయించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







