భారత్కు లెవల్-2 కేటాయించిన అమెరికా
- January 11, 2018
వాషింగ్టన్ : భారతదేశంలో విదేశీ పర్యాటకులు ప్రయాణించాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలని తాజా ప్రయాణ సలహా మండలి పేర్కొంది. భారత్తో పాటు దేశాలకు ఒక కొత్త ప్రయాణ సలహాలను యునైటెడ్ స్టేట్స్ జారీ చేసింది. ఇది వినియోగదారులకు స్నేహపూర్వకమవుతుందని పేర్కొన్నారు. దీనిలో నాలుగు స్థాయిలు ఉంటాయని, ఈ స్థాయిలలో భారత్ది లెవల్ -2 కాగా, పాకిస్తాన్ది లెవల్ -3 అని పేర్కొన్నారు. లెవల్ -1 అయితే ప్రయాణికులు సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని, లెవల్ -4 అయితే ప్రయాణం చేయవద్దని సూచించింది. ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలకు లెవల్ -4 కేటాయించింది. భారత్కు కేటాయించిన రెండవ లెవల్ అంటే హెచ్చరికలు, జాగ్రత్తలు పెరుగుతాయని సూచించింది. మూడవ లెవల్ అంటే ప్రయాణంపై పునరాలోచించుకోవాలని సూచనలు జారీ చేసినట్లు తెలిపింది. ఈ వ్యవస్థద్వారా ప్రతిదేశం ఒక ప్రయాణపు సలహాను కలిగి వుంటుందని, ఇది గతంలో వున్న సలహాలను భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా స్పష్టమైన, సమయానుకూలమైన , విశ్వసనీయమైన భద్రత, భద్రతా సమాచారాన్ని యుఎస్ పౌరులకు అందజేస్తుందని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. భారత్లో అత్యధికంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారాలు ఒకటని, దీంతో పర్యాటక ప్రదేశాలలో లైంగిక వేధింపులు, హింస వంటివి పెరుగుతున్నాయని కొత్త భారత ప్రయాణపు సలహాలలో పేర్కొంది. దీంతో భారత్కు లెవల్ 2ను కేటాయించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









