బాబోయ్ దొంగలు పడ్డారు.. కోట్లల్లో దోచుకున్నారు

- January 11, 2018 , by Maagulf
బాబోయ్ దొంగలు పడ్డారు.. కోట్లల్లో దోచుకున్నారు

అక్కడ ఉన్న లైటింగ్ కంటే ఆ నగలే కళ్లను జిగేల్ మనిపిస్తున్నాయి. వచ్చిన వారి కళ్లను కప్పేస్తున్నాయి. పారిస్‌లోని ప్లేస్ వెండోమ్‌లోని ప్రఖ్యాత రిట్జ్ హోటల్‌లో ఆభరణాల ప్రదర్శన జరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత నగల తయారీ దారులందరూ తమ దుకాణాల్లోని కొత్తగా వచ్చిన, అత్యధిక బరువు ధర పలుకుతున్న ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. హోటల్ చుట్టూ బందోబస్తుని కూడా భారీగానే ఏర్పాటు చేశారు. అయినా సరే ఎక్కడినుంచి వచ్చారో ఆ ఆగంతకులు సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి చొరబడ్డారు. దర్జాగా దోచుకున్నారు. అయితే అనుమానం వచ్చిన సెక్యూరిటీ ముగ్గురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు నగలు తీసుకుని ఉడాయించారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.30 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com