30 ఏళ్లలోపు ప్రవాసియ గ్రాడ్యుయేట్లను జులై 1 వ తేదీ నుండి ఉద్యోగాలలో ఇక నియమించరు
- January 22, 2018
కువైట్: ఈ ఏడాది జులై 1 వ తేదీ నుండి 30 ఏళ్ల లోపు ప్రవాసియ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాలలో నియమించడం లేదని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. యూనివర్శిటీ సర్టిఫికేట్లను కలిగి ఉన్న 30 ఏళ్ళ లోపు వయసు ఉన్న విదేశీయుల నియామకాలను నిలిపివేస్తామని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ నిర్ణయం అమలు చేయాలని భావించారు, కాని సాంఘిక వ్యవహారాల మంత్రి మరియు కార్మిక , ఆర్థిక శాఖ మంత్రి హిందూ అల్-సబీలు ఆరునెలల పాటు వాయిదా వేయాలని కోరారు. ఈ గడువులోపల సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని కోరారు. ప్రణాళికా మరియు నైపుణ్యాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జులై 1, 2018 నాటికి అధికారంగా నిర్ణయం తీసుకుంటుందని పామ్ డాక్టర్ ముబారక్ అల్-అజ్మీ వద్ద అక్రిడిటేషన్ సెక్టార్ ధృవీకరించింది. ప్రత్యేకించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయడం కంటే సాంకేతిక అంశాలను క్షుణంగా పరిశీలించి అమలు చేయడం మంచిదని తెలిపింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







