30 ఏళ్లలోపు ప్రవాసియ గ్రాడ్యుయేట్లను జులై 1 వ తేదీ నుండి ఉద్యోగాలలో ఇక నియమించరు
- January 22, 2018
కువైట్: ఈ ఏడాది జులై 1 వ తేదీ నుండి 30 ఏళ్ల లోపు ప్రవాసియ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాలలో నియమించడం లేదని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. యూనివర్శిటీ సర్టిఫికేట్లను కలిగి ఉన్న 30 ఏళ్ళ లోపు వయసు ఉన్న విదేశీయుల నియామకాలను నిలిపివేస్తామని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ నిర్ణయం అమలు చేయాలని భావించారు, కాని సాంఘిక వ్యవహారాల మంత్రి మరియు కార్మిక , ఆర్థిక శాఖ మంత్రి హిందూ అల్-సబీలు ఆరునెలల పాటు వాయిదా వేయాలని కోరారు. ఈ గడువులోపల సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని కోరారు. ప్రణాళికా మరియు నైపుణ్యాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జులై 1, 2018 నాటికి అధికారంగా నిర్ణయం తీసుకుంటుందని పామ్ డాక్టర్ ముబారక్ అల్-అజ్మీ వద్ద అక్రిడిటేషన్ సెక్టార్ ధృవీకరించింది. ప్రత్యేకించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయడం కంటే సాంకేతిక అంశాలను క్షుణంగా పరిశీలించి అమలు చేయడం మంచిదని తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









