కర్నాటక బంద్ బంద్..
- January 24, 2018బెంగళూరు: మహదాయి నదీ జలాలను తమ రాష్ట్రానికి పంపిణీ చేయించాలని డిమాండ్ చేస్తూ కర్నాటకలో గురువారం బంద్ ప్రారంభమైంది. గోవా-కర్నాటక మధ్య ఈ అంతరాష్ట్ర నదీ జలాల పంపిణీ వివాద నేపథ్యంలో కర్నాటక రక్షణ వేదిక, వివిధ సంస్థలు రైతులు సంయుక్తంగా గురువారం బంద్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మహదాయి నది మిగులు జలాలను గోవా ప్రభుత్వం సముద్రంలోకి వృథాగా వదిలేస్తోందని, ఆ జలాలను కర్నాటక రైతులకు పంపిణీ చేయించాలని ప్రధాని నరేంద్రమెడీని కర్నాటక రక్షణ వేదిక డిమాండ్ చేస్తోంది. బంద్తో గురవారం కర్నాటకలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు తెరవలేదు. ఉదయం 6 గంటల నుండీ ప్రజా రవాణా వాహనాలు స్తంభించాయి. కర్నాటక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో బస్సులు నిలిచిపోయాయి టాక్సీలు, ఆటోలు నిలిచిపోయాయి. పాఠశాలలు మూసివేశారు. బెంగళూరు మెట్రో సర్వీసులలో కొన్నింటిని మాత్రం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కర్నాటలో ఈ బంద్ కొనసాగుతుండగా బిజెపి అధ్యక్షులు అమిత్షా గురువారమే మైసూర్లో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు