గేల్ను ఆదుకున్న ప్రీతి
- January 28, 2018
బెంగళూరు: క్రిస్ గేల్.. ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ట్వంటీ 20ల్లో అమోఘమైన రికార్డు ఈ విధ్వంసకర క్రికెటర్ సొంతం. ప్రధానంగా సిక్సర్ల కింగ్గా పిలుచుకునే గేల్... ఈసారి ఐపీఎల్ వేలంలో ఎట్టకేలకు అమ్ముడుపోయాడు. గేల్ను రూ. 2 కోట్లకు కింగ్స్ పంజాబ్ చివరి నిమిషంలో దక్కించుకుంది. అతనికున్న కనీస ధరకే కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకుంది. కింగ్స్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతా కనికరించడంతో గేల్కు ఊరట లభించినట్లయ్యింది.
శనివారం తొలి రోజు వేలంలో అమ్ముడుపోని గేల్.. ఆదివారం రెండో రోజు వేలం ఆరంభంలో కూడా అమ్ముడుపోలేదు. ఈ రోజు అన్సోల్డ్ వేలం పాటలో భాగంగా తొలుత గేల్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కాగా, అమ్ముడుపోని క్రికెటర్లకు ఆఖర్లో మరొకసారి వేలం జరగ్గా గేల్ను కొనుగోలు చేయడానికి కింగ్స్ పంజాబ్ ఆసక్తి చూపింది. అతని కనీస ధర రూ. 2 కోట్లకే కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు గప్టిల్కు మూడోసారి కూడా నిరాశే ఎదురుకావడం గమనార్హం.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో గన్ తో కానిస్టేబుల్ హాల్ చల్
- కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!









