కొత్తగా మూడు పధకాలను ప్రారంభించనున్న ఎమిరేట్స్ పర్యావరణ మంత్రిత్వ శాఖ
- November 24, 2015
యు.ఎ.ఈ. పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు, ఆ తరహాలోనే కొత్తవైనా 'డ్రాప్ ఆఫ్ లైఫ్', 'బయోలాజికల్ ఫిల్టర్', 'ఇన్నోవేషన్ ఇన్ అగ్రికల్చురల్ వర్క్' అనే మూడు పర్యావరణ హిత పధకాలను ప్రారంభించనున్నట్టు యు.ఎ.ఈ. సృజనాత్మక వారోత్సవాల సందర్భంగా ప్రకటించారు. నవంబరు 22 న ఎమిరేట్స్ ఉపాధ్యక్షులు మరియు ప్రధాని , దుబాయి పరిపాలకులు ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రహిద్ అల్ మక్తౌం వారిచే ప్రారంభిం చబడిన ఈ కార్యక్రమం, నవంబర్ 28 వరకు కొనసాగుతుంది. 'డ్రాప్ ఆఫ్ లైఫ్'- పధకం, గాలి నుండి తేమను గ్రహించి నీటిగా మార్చి, ఆ నీటిని పంటలకు వాడేలా నిర్మించబడింది. 'బయోలాజికల్ ఫిల్టర్' పధకం సేంద్రియ వ్యవసాయంలో ఉత్పత్తి, మార్కెటింగ్, భూసారం మరియు విత్తనోత్పత్తి లో సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది. ఇక 'ఇన్నోవేషన్ ఇన్ అగ్రికల్చురల్ వర్క్' అనేది యు.ఎ.ఈ. పౌరులు, నివాసులు మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రజల నుండి కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి సృజనాత్మక ఆలోచనలను ఆకర్షించడానికి రుపొందించబడిన ఒక వెబ్ సైట్. ఈ ఆలోచనలు, ఆచరణాత్మకంగా ఎంతమేరకు ఉపయోగపడతాయి అనేది నిపుణులు విశ్లేషించి, వానిని మంత్రివర్గ సహకారంతో అమలులో పెడతారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







