బాంబు పేలుడుతో వణికిన గ్రీస్
- November 24, 2015
అతి శక్తిమంతమైన బాంబు పేలుడుతో మంగళవారం గ్రీస్ ఒక్కసారిగా వణికింది. రాజధాని ఏథెన్స్ లో నిత్యమూ బిజీగా ఉండే బిజినెస్ ఫెడరేషన్ కార్యాలయాల వద్ద ఈ ఘటన జరుగగా, ఎవరూ గాయపడలేదని, పలు భవనాల అద్దాలు పగిలాయని పోలీసు అధికారులు తెలిపారు. మరికొన్ని గంటల తరువాత ఇదే పేలుడు జరిగి వుంటే ప్రాణనష్టం తీవ్రంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని, ఇప్పటికీ పూర్తిగా బయటపడని గ్రీస్ లో రాజకీయ హింసాకాండ చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పేలుడు తామే జరిపినట్టు ఇప్పటివరకూ ఏ సంస్థా ప్రకటించలేదు. దేశంలోని ఏదైనా ఓ గెరిల్లా గ్రూప్ ఈ దాడి జరిపి ఉండవచ్చని తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 7 గంటల సమయంలో (గ్రీస్ కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 3:30) దాడి జరిగింది. ఆపై ఓ అరగంట తరువాత స్థానిక దినపత్రికకు బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బౄఎందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









