బాంబు పేలుడుతో వణికిన గ్రీస్
- November 24, 2015
అతి శక్తిమంతమైన బాంబు పేలుడుతో మంగళవారం గ్రీస్ ఒక్కసారిగా వణికింది. రాజధాని ఏథెన్స్ లో నిత్యమూ బిజీగా ఉండే బిజినెస్ ఫెడరేషన్ కార్యాలయాల వద్ద ఈ ఘటన జరుగగా, ఎవరూ గాయపడలేదని, పలు భవనాల అద్దాలు పగిలాయని పోలీసు అధికారులు తెలిపారు. మరికొన్ని గంటల తరువాత ఇదే పేలుడు జరిగి వుంటే ప్రాణనష్టం తీవ్రంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని, ఇప్పటికీ పూర్తిగా బయటపడని గ్రీస్ లో రాజకీయ హింసాకాండ చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పేలుడు తామే జరిపినట్టు ఇప్పటివరకూ ఏ సంస్థా ప్రకటించలేదు. దేశంలోని ఏదైనా ఓ గెరిల్లా గ్రూప్ ఈ దాడి జరిపి ఉండవచ్చని తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 7 గంటల సమయంలో (గ్రీస్ కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 3:30) దాడి జరిగింది. ఆపై ఓ అరగంట తరువాత స్థానిక దినపత్రికకు బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బౄఎందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







