మయన్మార్లో ప్రమాదకర స్థాయిలో హింస
- February 10, 2018
మయన్మార్లో రోహింగ్యా ముస్లింలపై కొనసాగుతున్న హింస ప్రమాదకరస్థాయిలో వుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్లో కొనసాగుతున్న హింసాకాండపై ఒక మీడియా సంస్థ దర్యాప్తు చేసిన వార్తా కథనంపై స్పందించిన ప్రపంచ సంస్థ ప్రతినిధి ఫర్హాన్ హక్ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రఖినే రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలపై కొనసాగుతున్న హింసాకాండ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం వుందని అన్నారు. మయన్మార్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన ఇద్దరు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ డిమాండ్ చేశారని, వారిని విడుదల చేసే వరకూ తాము మయన్మార్పై వత్తిడి కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







