రాష్ట్రపతి, ప్రధాని కోసం అత్యాధునిక విమానాలు
- March 12, 2018న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి, ప్రధానిలకు ఇక కొత్త విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అత్యుధానిక సదుపాయాలతో ఆ విమానాలను రూపొందిస్తున్నారు. 2020లోగా ఎయిర్ ఇండియా వన్ విమానాలు సర్వీస్లోకి వస్తాయి. దీని కోసం బోయింగ్ 777 విమానాలకు అప్గ్రేడ్ చేస్తున్నారు. భారత ఉప రాష్ట్రపతికి కూడా మరో ఆధునిక విమానం అందుబాటులోకి రానున్నది. ఈ ఏడాది ఆరంభంలోనే మూడు బోయింగ్ 777లను కొనుగోలు చేశారు. ఆ విమానాలకు కొత్త ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నారు. సెక్యూర్టీ సిస్టమ్లను మరింత పకడ్బందీగా మారుస్తున్నారు. రెండు బోయింగ్లకు మాత్రం వీఐపీ ఎన్క్లోజర్ను, ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్, మెడికల్ ఎమర్జెన్సీ యూనిట్ను తయారు చేస్తున్నారు. ఈ విమానాల్లో వైఫైని కూడా అమరుస్తున్నారు. యాంటీ మిస్సైల్ సిస్టమ్స్, రాడార్ మెకానిక్స్, ఇతర సెక్యూర్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు రాష్ట్రపతి, ప్రధాని కోసం బోయింగ్ 747ఎస్ విమానాలను వాడారు. 777 వల్ల వీవీఐపీ ట్రాన్స్పోర్ట్లో చాలా మార్పు వస్తుం
ది. ఈ ప్లేన్తో నాన్స్టాప్గా అమెరికా వరకు వెళ్లవచ్చు. అంటే దారిలో రీఫుయలింగ్ ఇక అవసరం ఉండదు. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అత్యాధునికంగా ఉంటుంది. వీవీఐపీలకు పరన్సల్ రూమ్లు కూడా
ఉంటాయి. ఈ విమానాలకు రెండు జీఈ90-115బీఎల్ ఇంజిన్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ ఇంజిన్లే విమానాలకు అత్యంత శక్తివంతమైనవని భావిస్తున్నారు. త్వరలోనే ఎయిర్ ఇండియా నుంచి ఈ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?