గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ని సస్పెండ్ చేసిన యూఏఈ
- April 01, 2018
ఫిబ్రవరి 4న గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ విషయమై జారీ చేసిన ఆదేశాల్ని, యూఏఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. యూఏఈకి ఉద్యోగ నిమిత్తం వచ్చేవారు తమ స్వదేశం నుంచి పోలీస్ ద్వారా గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తీసుకురావడం తప్పనిసరి అని ఫిబ్రవరి 4న దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ విధానంపై విమర్శలు రావడం, అనేక అనుమానాలు తలెత్తడంతో యూఏఈ ప్రభుత్వం 'సస్పెండ్' నిర్ణయం తీసుకుంది. గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి నిర్ణయం పోస్ట్పోన్ అయ్యిందనీ, తదుపరి నోటీసు వచ్చేదాకా ఈ నిర్ణయం అమల్లో వుంటుందని మినిస్ట్రీ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. కొత్త రూల్కి సంబంధించి ఎంబసీలు తీవ్ర గందరగోళంలో పడ్డాయి. ఈ విషయాన్ని ఎంబసీలు, యూఏఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాయి. దాంతో యూఏఈ ప్రభుత్వం గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







