గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ని సస్పెండ్ చేసిన యూఏఈ
- April 01, 2018
ఫిబ్రవరి 4న గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ విషయమై జారీ చేసిన ఆదేశాల్ని, యూఏఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. యూఏఈకి ఉద్యోగ నిమిత్తం వచ్చేవారు తమ స్వదేశం నుంచి పోలీస్ ద్వారా గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తీసుకురావడం తప్పనిసరి అని ఫిబ్రవరి 4న దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ విధానంపై విమర్శలు రావడం, అనేక అనుమానాలు తలెత్తడంతో యూఏఈ ప్రభుత్వం 'సస్పెండ్' నిర్ణయం తీసుకుంది. గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి నిర్ణయం పోస్ట్పోన్ అయ్యిందనీ, తదుపరి నోటీసు వచ్చేదాకా ఈ నిర్ణయం అమల్లో వుంటుందని మినిస్ట్రీ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. కొత్త రూల్కి సంబంధించి ఎంబసీలు తీవ్ర గందరగోళంలో పడ్డాయి. ఈ విషయాన్ని ఎంబసీలు, యూఏఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాయి. దాంతో యూఏఈ ప్రభుత్వం గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









