చర్చీల్లో పేలుళ్ల కేసు... 36మందికి ఉరిశిక్ష
- April 11, 2018
కైరో : ఈజిప్టులోని రెండు చర్చీల్లో పేలుళ్లకు పాల్పడి 46 మందిని బలిగొన్న 36 మంది నిందితులు ఈజిప్టు మిలిటరీ కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులోని దోషులకు ఉరిశిక్ష విధించినట్టు బుధ వారం సంచలన తీర్పు వెలువరిం చింది. ఈకేసులో దోషులుగా తేలిన వారందరికీ ఐఎస్తో సంబంధాలున్నాయని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. గతంలో వారు పాల్పడ్డ నేరాలను కూడా పరిగణనలోకి తీసుకొని తీర్పు వెలువరించినట్టు తీర్పు వెలువరించే సమయంలో జడ్జీ పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈజిప్టులోని అలెగ్జాండ్రియా, టాంటా చర్చిల్లో గతేడాది ఏప్రిల్లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 46 మంది మృతి చెందగా, దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో పోలీసులు 48మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. 36మందిపై కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. నిందితులకు ఉగ్రవాదంతో సంబంధాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఫాస్ట్ట్రాక్ మిలిటరీ కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. దోషులకు మరణదండ విధించినట్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఈజిప్టు ముఫ్తీ సూచనలు కూడా కోరింది. దోషులకు ఉరే సరి అని ముఫ్తీ సైతం వెల్లడించడంతో మరణశిక్ష దాదాపు ఖరారైనట్టే. ఈజిప్టు చట్టాల ప్రకారం..మరణదండన విధించిన ఖైదీల వివరాలు ముఫ్తీకి పంపుతారు. ఒకవేళ ఉరిశిక్ష విధించాల్సిన అవసరం ఉందని ముఫ్తీ సిఫారసు చేస్తే కచ్చితంగా అమలు చేస్తారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









