చర్చీల్లో పేలుళ్ల కేసు... 36మందికి ఉరిశిక్ష
- April 11, 2018
కైరో : ఈజిప్టులోని రెండు చర్చీల్లో పేలుళ్లకు పాల్పడి 46 మందిని బలిగొన్న 36 మంది నిందితులు ఈజిప్టు మిలిటరీ కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులోని దోషులకు ఉరిశిక్ష విధించినట్టు బుధ వారం సంచలన తీర్పు వెలువరిం చింది. ఈకేసులో దోషులుగా తేలిన వారందరికీ ఐఎస్తో సంబంధాలున్నాయని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. గతంలో వారు పాల్పడ్డ నేరాలను కూడా పరిగణనలోకి తీసుకొని తీర్పు వెలువరించినట్టు తీర్పు వెలువరించే సమయంలో జడ్జీ పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈజిప్టులోని అలెగ్జాండ్రియా, టాంటా చర్చిల్లో గతేడాది ఏప్రిల్లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 46 మంది మృతి చెందగా, దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో పోలీసులు 48మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. 36మందిపై కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. నిందితులకు ఉగ్రవాదంతో సంబంధాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఫాస్ట్ట్రాక్ మిలిటరీ కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. దోషులకు మరణదండ విధించినట్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఈజిప్టు ముఫ్తీ సూచనలు కూడా కోరింది. దోషులకు ఉరే సరి అని ముఫ్తీ సైతం వెల్లడించడంతో మరణశిక్ష దాదాపు ఖరారైనట్టే. ఈజిప్టు చట్టాల ప్రకారం..మరణదండన విధించిన ఖైదీల వివరాలు ముఫ్తీకి పంపుతారు. ఒకవేళ ఉరిశిక్ష విధించాల్సిన అవసరం ఉందని ముఫ్తీ సిఫారసు చేస్తే కచ్చితంగా అమలు చేస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







