సౌదీ అరేబియా :తండ్రిని హతమార్చిన కేసులో దోషికి మరణ శిక్ష
- June 26, 2018
సౌదీ అరేబియా :తండ్రిని సజీవ దహనం చేసిన వ్యక్తికి మరణ శిక్ష విధించినట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. సౌదీ జాతీయుడైన మనాహి అల్ బురూక్ అల్ బిషి, అతని తండ్రిపై గ్యాసోలైన్ని పోసి నిప్పంటించాడు. నిద్రిస్తున్న తండ్రి, ఆ నిద్రలోనే హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనే ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారించారు. సుప్రీంకోర్టుకి నిందితుడ్ని తరలించగా, అక్కడా అతనే నేరం చేసినట్లు రుజువయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడికి మరణ శిక్ష విధించడమయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం విధించిన మరణ శిక్షను అమలుపరిచారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు ఉరిశిక్ష విధించడం ద్వారా చెక్ పెట్టగలమని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







