సౌదీ అరేబియా :తండ్రిని హతమార్చిన కేసులో దోషికి మరణ శిక్ష
- June 26, 2018
సౌదీ అరేబియా :తండ్రిని సజీవ దహనం చేసిన వ్యక్తికి మరణ శిక్ష విధించినట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. సౌదీ జాతీయుడైన మనాహి అల్ బురూక్ అల్ బిషి, అతని తండ్రిపై గ్యాసోలైన్ని పోసి నిప్పంటించాడు. నిద్రిస్తున్న తండ్రి, ఆ నిద్రలోనే హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనే ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారించారు. సుప్రీంకోర్టుకి నిందితుడ్ని తరలించగా, అక్కడా అతనే నేరం చేసినట్లు రుజువయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడికి మరణ శిక్ష విధించడమయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం విధించిన మరణ శిక్షను అమలుపరిచారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు ఉరిశిక్ష విధించడం ద్వారా చెక్ పెట్టగలమని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









