హస్కా ప్రావిన్స్ లో ఐఎస్ఐఎస్ మారణహోమం..
- December 11, 2015
సిరియా ఈశాన్య ప్రాంతంలో హస్కా ప్రావిన్స్ లో తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మారణహోమం సృష్టించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుని ట్రక్కు బాంబులు పేల్చింది. ఈ ఘటనలో 60 మందికిపైగా మరణించారు. మరో 80 మందికిపైగా గాయపడ్డారు. ఈ మేరకు కుర్దిష్ మిలటరీకి చెందిన ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. హస్కా పట్టణంలోని ఆసుపత్రి, మార్కెట్ వద్ద శుక్రవారం ఈ దాడులు జరగగా... మరోకటి గురువారం ఆర్థరాత్రి టెల్ టమర్ పట్టణంలోని నివాస ప్రాంతాల సమీపంలో ఈ ట్రక్కు పేలుడు సంభవించిందని చెప్పారు. సిరియాలోని యూఎస్ సంకీర్ణ దళాలకు స్థానిక కుర్ధిష్ మిలటరీ సహకారం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ ఈ దాడికి తెగబడిందని ఉన్నతాధికారి వివరించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









