సీఎల్ఎల్వీ సి29 నింగిలోకి దూసుకెళ్లనుంది
- December 13, 2015
పీఎస్ఎల్వీ సి29 కౌంట్డౌన్ ప్రారంభం ఇటీవల వరుస విజయవంతమైన ప్రయోగాలతో ఉత్సాహంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో విదేశీ వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈనెల 16న పీఎస్ఎల్వీ సి29 వాహననౌక ద్వారా సింగపూర్కు చెందిన ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఈరోజు ఉదయం ఏడు గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో వాతావరణ పరిశీలనకు సంబంధించిన 400 కిలోల టెలిమోస్ ఉపగ్రహం ఉంది. మిగిలిన అన్నీ నానో ఉపగ్రహాలే. ఆదివారం మధ్యాహ్నం రాకెట్ సన్నద్ధత సమావేశం జరిగింది. ముందస్తు కౌంట్డౌన్ ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించారు. 59 గంటల కౌంట్డౌన్ ప్రక్రియ ముగియగానే బుధవారం సాయంత్రం 6 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సింగపూర్కు స్వాతంత్య్రం వచ్చి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశ అంతరిక్ష సంస్థ కోరిక మేరకు ఆరు ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి పంపనుంది. మొత్తం 625 కిలోల బరువు గల సింగపూర్ ఉపగ్రహాలతో సీఎల్ఎల్వీ సి29 వాహననౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







