సీఎల్ఎల్వీ సి29 నింగిలోకి దూసుకెళ్లనుంది
- December 13, 2015
పీఎస్ఎల్వీ సి29 కౌంట్డౌన్ ప్రారంభం ఇటీవల వరుస విజయవంతమైన ప్రయోగాలతో ఉత్సాహంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో విదేశీ వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈనెల 16న పీఎస్ఎల్వీ సి29 వాహననౌక ద్వారా సింగపూర్కు చెందిన ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఈరోజు ఉదయం ఏడు గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో వాతావరణ పరిశీలనకు సంబంధించిన 400 కిలోల టెలిమోస్ ఉపగ్రహం ఉంది. మిగిలిన అన్నీ నానో ఉపగ్రహాలే. ఆదివారం మధ్యాహ్నం రాకెట్ సన్నద్ధత సమావేశం జరిగింది. ముందస్తు కౌంట్డౌన్ ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించారు. 59 గంటల కౌంట్డౌన్ ప్రక్రియ ముగియగానే బుధవారం సాయంత్రం 6 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సింగపూర్కు స్వాతంత్య్రం వచ్చి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశ అంతరిక్ష సంస్థ కోరిక మేరకు ఆరు ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి పంపనుంది. మొత్తం 625 కిలోల బరువు గల సింగపూర్ ఉపగ్రహాలతో సీఎల్ఎల్వీ సి29 వాహననౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









