కేరళకు వివిధ రాష్ట్రాలు ఎంతెంత విరాళాలు ఇచ్చాయంటే..
- August 18, 2018కేరళలో విపత్తును చూసి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు చలించిపోతున్నాయి. ఆదుకునేందుకు మానవతాసాయంతో ముందుకు వస్తున్నాయి. వరద బాధితుల కోసం ఆహారం, మంచి నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక రైలు మహారాష్ట్రలోని పుణె నుంచి బయల్దేరింది. కేరళలోని చిన్నారుల కోసం.. వంద టన్నుల ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వంద మెట్రిక్ టన్నుల బాలామృతాన్ని పంపిస్తోంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ 10కోట్ల సహాయం ప్రకటించారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ 10కోట్లు.. తెలంగాణ సర్కారు 25కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10కోట్ల విరాళం ప్రకటించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 10కోట్ల సాయం అందజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక నెల జీతాన్ని కేరళ సహాయ నిధికి ఇవ్వనున్నారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కేరళ బాధితుల కోసం కోటి విరాళంగా ప్రకటించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 కోట్ల సాయం ప్రకటించింది.
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 10కోట్ల ఆర్థికసాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 5 కోట్ల సాయం ప్రకటించారు. అలాగే సహాయక చర్యలు అందించేందుకు 245 మంది అగ్నిమాపక సిబ్బందిని పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందం 75బోట్లను కూడా తీసుకెళ్తోంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 20 కోట్ల సాయం ప్రకటించారు. ఇక.. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తారని ఏఐసీసీ తెలిపింది. కేరళ సీఎం విజయన్తో ఫోన్లో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు… అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్