చండీయాగం గురువారం రెండోరోజుకు
- December 23, 2015
మెదక్జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం గురువారం రెండోరోజుకు చేరింది. ఉదయం గురుప్రార్థనతో యాగం ప్రారంభించారు. గోపూజ, ఏకాదశ న్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, యోగినీ బలి, మహాధన్వంతరీ యాగం, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, మహాసౌరము, ఉక్తదేవతా జపాలు, కుమారి, సువాసినీ, దంపతీపూజా, మహా మంగళహారతి, విశేష నమస్కారాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి ధార్మిక ప్రవచనం ఉంటుంది. సాయంత్రం కోటి నవాక్షరీ పురశ్చరణ, ఉపచార పూజ, విశేష నమస్కారాలు, శ్రీచక్ర మండలారాధనం, అష్టావధాన సేవ, ప్రసాద వినియోగం. రాత్రి 7.30గంటలకు శ్రీరామలీల (హరికథ). రెండో రోజు అయుత చండీయాగానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్రావు తదితరులు పాల్గొన్నారు. యాగశాల వద్ద సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







