చండీయాగం గురువారం రెండోరోజుకు

- December 23, 2015 , by Maagulf
చండీయాగం గురువారం రెండోరోజుకు

మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న అయుత చండీయాగం గురువారం రెండోరోజుకు చేరింది. ఉదయం గురుప్రార్థనతో యాగం ప్రారంభించారు. గోపూజ, ఏకాదశ న్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, యోగినీ బలి, మహాధన్వంతరీ యాగం, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, మహాసౌరము, ఉక్తదేవతా జపాలు, కుమారి, సువాసినీ, దంపతీపూజా, మహా మంగళహారతి, విశేష నమస్కారాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి ధార్మిక ప్రవచనం ఉంటుంది. సాయంత్రం కోటి నవాక్షరీ పురశ్చరణ, ఉపచార పూజ, విశేష నమస్కారాలు, శ్రీచక్ర మండలారాధనం, అష్టావధాన సేవ, ప్రసాద వినియోగం. రాత్రి 7.30గంటలకు శ్రీరామలీల (హరికథ). రెండో రోజు అయుత చండీయాగానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. యాగశాల వద్ద సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సీఎం కేసీఆర్‌, మంత్రులు స్వాగతం పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com