శమరిమల ఆలయం మూసివేత..
- December 26, 2018
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ఇవాళ అయ్యప్పస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. గత నెల 15వ తేదీ నుంచి మండల పూజలు ప్రారంభం కాగా... 41వ రోజైన ఇవాళ రాత్రి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. ఇక మకరవిళక్కు సందర్భంగా ఈ నెల 30వ తేదీన తిరిగి ఆలయాన్ని తెరుస్తారు పూజారులు... అదే రోజున ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గం, వండిపెరియార్ నుంచి పులిమేడు దారుల్లో భక్తులకు అనుమతిస్తారు. ఇక జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో అన్ని వయస్సుల మహిళలకు అయ్యప్పదర్శనం కలిపించేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆలయ ప్రవేశానికి మహిళలు యత్నించడం... కొందరు భక్తులు అడ్డుకోవడం జరుగుతోంది.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







