అనాథల కోసం శాంతాక్లజ్ గా సచిన్..
- December 26, 2018

ముంబై : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిన్నారుల కోసం శాంతాక్లాజ్ అవతారం ఎత్తారు. క్రిస్మస్ వేడుక సందర్భంగా అనాధ పిల్లల కోసం ముంబయిలోని ఆశ్రయ్ ఛైల్డ్ కేర్ సెంటర్లోని చిన్నారులతో కలిసి ఆడిపాడారు. వారితో క్రికెట్ ఆడారు. వారితో గడిపిన ఆ క్షణాలు మరిచిపోలేనివని మురిసిపోయారు సచిన్ టెండూల్కర్. తెల్లని గెడ్డం..మీసాలు..ఎర్రని టోపీ పెట్టుకుని ఇంటిదగ్గర నుండి క్లాజ్ వేషంతోనే ఆనాథశ్రమానికి బయల్దేరారు. ఆశ్రయ్ ఛైల్డ్ కేర్ చిన్నారులతో సరదాగా సరదాగా క్రికెట్ ఆడుతూ వారిలో ఆనందాన్ని నింపారు. తరువాత వారికి ఇష్టమైన బ్యాట్లు, క్రికెట్ కిట్లతోపాటు బ్యాట్మింటన్ రాకెట్స్, ఫుట్బాల్స్లను వారికి క్రిస్మస్ బహుమతిగా అందించారు. సచిన్ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
''హో.. హో.. హో.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆశ్రయ్ చైల్డ్ కేర్ సెంటర్లో చిన్నారులతో కలిసి గడపడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చిందనీ..వారి అమాయకమైన ముఖాలపై ఆనందం వెలకట్టలేనిది'' అంటూ సచిన్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







