అనాథల కోసం శాంతాక్లజ్ గా సచిన్..
- December 26, 2018
ముంబై : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిన్నారుల కోసం శాంతాక్లాజ్ అవతారం ఎత్తారు. క్రిస్మస్ వేడుక సందర్భంగా అనాధ పిల్లల కోసం ముంబయిలోని ఆశ్రయ్ ఛైల్డ్ కేర్ సెంటర్లోని చిన్నారులతో కలిసి ఆడిపాడారు. వారితో క్రికెట్ ఆడారు. వారితో గడిపిన ఆ క్షణాలు మరిచిపోలేనివని మురిసిపోయారు సచిన్ టెండూల్కర్. తెల్లని గెడ్డం..మీసాలు..ఎర్రని టోపీ పెట్టుకుని ఇంటిదగ్గర నుండి క్లాజ్ వేషంతోనే ఆనాథశ్రమానికి బయల్దేరారు. ఆశ్రయ్ ఛైల్డ్ కేర్ చిన్నారులతో సరదాగా సరదాగా క్రికెట్ ఆడుతూ వారిలో ఆనందాన్ని నింపారు. తరువాత వారికి ఇష్టమైన బ్యాట్లు, క్రికెట్ కిట్లతోపాటు బ్యాట్మింటన్ రాకెట్స్, ఫుట్బాల్స్లను వారికి క్రిస్మస్ బహుమతిగా అందించారు. సచిన్ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
''హో.. హో.. హో.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆశ్రయ్ చైల్డ్ కేర్ సెంటర్లో చిన్నారులతో కలిసి గడపడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చిందనీ..వారి అమాయకమైన ముఖాలపై ఆనందం వెలకట్టలేనిది'' అంటూ సచిన్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?