రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుమల తిరుపతిలో పర్యటన..

- December 24, 2015 , by Maagulf
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుమల తిరుపతిలో పర్యటన..

రేపు తిరుమల తిరుపతిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రేణిగుండ విమానశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి 3.15 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రణబ్ శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5.15 గంటలకు తిరుమల నుంచి ఆయన తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతి బస చేసే పద్మావతి ప్రాంతంలోని గదులను టీటీడీ బ్లాక్ చేసినట్టు పేర్కొంది. ప్రోటోకాల్ పరిధిలోని వారికే వీఐపీ దర్శనాలు ఉంటాయంది. మధ్నాహ్నం 3 గంటలకు వృద్ధుల దర్శనం రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. అంతేకాక వీఐపీ దర్శనాలను కుదింపు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, తిరుమల తిరుపతిలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా మాడ విధుల్లో గరుడవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com