రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుమల తిరుపతిలో పర్యటన..
- December 24, 2015
రేపు తిరుమల తిరుపతిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రేణిగుండ విమానశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి 3.15 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రణబ్ శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5.15 గంటలకు తిరుమల నుంచి ఆయన తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతి బస చేసే పద్మావతి ప్రాంతంలోని గదులను టీటీడీ బ్లాక్ చేసినట్టు పేర్కొంది. ప్రోటోకాల్ పరిధిలోని వారికే వీఐపీ దర్శనాలు ఉంటాయంది. మధ్నాహ్నం 3 గంటలకు వృద్ధుల దర్శనం రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. అంతేకాక వీఐపీ దర్శనాలను కుదింపు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, తిరుమల తిరుపతిలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా మాడ విధుల్లో గరుడవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







