రానా, ఆర్య కలిసి ఒకే తెరపైకి

- December 24, 2015 , by Maagulf
రానా,  ఆర్య  కలిసి ఒకే తెరపైకి

భల్లాలదేవ అలియాస్ రానా, తమిళ నటుడు ఆర్య.. ఇద్దరూ ఆరడుగుల ఆజానుబాహులే. వీరికి మరో సారూప్యత కూడా ఉంది. పాత్ర నచ్చితే చాలు అది విలనీ అయినా రెడీ వెనక్కితగ్గరు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే తెరపైకి రాబోతున్నారు. తమిళ సినిమాలైన 'మౌనం పెసియాదే', 'పరుత్తివీరన్' (తెలుగులో మల్లిగాడు) చిత్రాల దర్శకుడు అమీర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఆర్య, రానాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆర్య నటించిన 'సైజ్‌జీరో' సినిమాలో రానా అతిథి పాత్రలో కనపడగా తమిళంలో వీరిద్దరూ బెంగళూర్ డేస్ రీమేక్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే రానా చేతిలో పలు సినిమాలున్నా కథ నచ్చడంతో 'బాహుబలి2' కంటే ముందే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడట రానా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com