రానా, ఆర్య కలిసి ఒకే తెరపైకి
- December 24, 2015
భల్లాలదేవ అలియాస్ రానా, తమిళ నటుడు ఆర్య.. ఇద్దరూ ఆరడుగుల ఆజానుబాహులే. వీరికి మరో సారూప్యత కూడా ఉంది. పాత్ర నచ్చితే చాలు అది విలనీ అయినా రెడీ వెనక్కితగ్గరు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే తెరపైకి రాబోతున్నారు. తమిళ సినిమాలైన 'మౌనం పెసియాదే', 'పరుత్తివీరన్' (తెలుగులో మల్లిగాడు) చిత్రాల దర్శకుడు అమీర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఆర్య, రానాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆర్య నటించిన 'సైజ్జీరో' సినిమాలో రానా అతిథి పాత్రలో కనపడగా తమిళంలో వీరిద్దరూ బెంగళూర్ డేస్ రీమేక్లో నటిస్తున్నారు. ఇప్పటికే రానా చేతిలో పలు సినిమాలున్నా కథ నచ్చడంతో 'బాహుబలి2' కంటే ముందే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడట రానా
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







