క్రిస్మస్ పర్వదినాన నైజీరియాలో విషాదం
- December 24, 2015
క్రిస్మస్ పర్వదినాన నైజీరియాలో విషాదం చోటు చేసుకుంది. ఆగ్నేయ నైజీరియాలోని న్యూవీ పారిశ్రామిక ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ ట్రక్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మరణించారు. క్రిస్మస్ పండగ నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ ఎక్కించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు క్యూలో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు సంభవించిన వెంటనే అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్నేయ నైజీరియాలో అధిక సంఖ్యలో క్రిస్టియన్లు నివసిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







