భారత విదేశాంగ శాఖ మీడియా సమావేశం..ఆ వివరాలు..
- February 27, 2019
భారత యుద్ధ విమానాలను కూల్చామన్న పాక్ వాదనల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ విలేఖర్లతో మాట్లాడారు. ఆ వివరాలు..
'తీవ్రవాదం వ్యతిరేక చర్యల్లో భాగంగా భారత్ నిన్న పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.
భారత్ చర్యలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఈ ఉదయం స్పందించింది.
పాక్ తమ వైమానిక దళంతో దాడికి ప్రయత్నించింది.
అప్రమత్తంగా ఉన్న భారత వైమానిక దళం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది.
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ను మన మిగ్ 21 బైసన్ విమానంతో కూల్చేశాం.
ఆ విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడం మన ఆర్మీ చూసింది.
అదే సమయంలో మనం దురదృష్టవశాత్తూ ఒక మిగ్ 21 కోల్పోయాం.
ఆ విమానంలో పైలెట్ మిస్ అయ్యారు.
అయితే ఆ పైలెట్ తమ కస్టడీలో ఉన్నట్టు పాకిస్తాన్ పేర్కొంటోంది.
ఇందులోని వాస్తవాలను భారత ప్రభుత్వం నిర్ధారించుకునే పనిలో ఉంది.'
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







