పాకిస్తాన్కి విమానాల్ని రద్దు చేసిన ఒమన్
- February 27, 2019
మస్కట్: భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఒమన్ ఎయిర్, పాకిస్తాన్కి విమానాల్ని రద్దు చేసింది. పాకిస్తాన్ వ్యాప్తంగా ముఖ్యమైన ఎయిర్పోర్ట్లన్నిటిలోనూ పౌర విమాన సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి వివిధ దేశాల నుంచి వెళ్ళాల్సిన విమానాలు రద్దయ్యాయి. పాకిస్తాన్ నుంచి కూడా విదేశాలకు విమానాలు వెళ్ళేందుకు వీలు లేకుండా పోయింది. ఒమన్తోపాటు, యూఏఈ సహా అన్ని దేశాలూ పాకిస్తాన్తో పౌర విమాన యానానికి సంబంధించి సంబంధాల్ని తాత్కాలికంగా తెంచుకోవాల్సి వచ్చింది. ఆయా విమానాశ్రయాల్లో పాకిస్తాన్కి వెళ్ళేందుకు సిద్ధమైన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, తాత్కాలికంగా భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాలకు విమానాలు రద్దు కాగా, సాయంత్రానికి పునరుద్ధరించబడ్డాయి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







