పాకిస్తాన్కి విమానాల్ని రద్దు చేసిన ఒమన్
- February 27, 2019
మస్కట్: భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఒమన్ ఎయిర్, పాకిస్తాన్కి విమానాల్ని రద్దు చేసింది. పాకిస్తాన్ వ్యాప్తంగా ముఖ్యమైన ఎయిర్పోర్ట్లన్నిటిలోనూ పౌర విమాన సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి వివిధ దేశాల నుంచి వెళ్ళాల్సిన విమానాలు రద్దయ్యాయి. పాకిస్తాన్ నుంచి కూడా విదేశాలకు విమానాలు వెళ్ళేందుకు వీలు లేకుండా పోయింది. ఒమన్తోపాటు, యూఏఈ సహా అన్ని దేశాలూ పాకిస్తాన్తో పౌర విమాన యానానికి సంబంధించి సంబంధాల్ని తాత్కాలికంగా తెంచుకోవాల్సి వచ్చింది. ఆయా విమానాశ్రయాల్లో పాకిస్తాన్కి వెళ్ళేందుకు సిద్ధమైన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, తాత్కాలికంగా భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాలకు విమానాలు రద్దు కాగా, సాయంత్రానికి పునరుద్ధరించబడ్డాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







