భారత్‌ - పాక్‌ యుద్ధం: ఆయా దేశాల ట్రావెల్‌ వార్నింగ్‌

- February 27, 2019 , by Maagulf
భారత్‌ - పాక్‌ యుద్ధం: ఆయా దేశాల ట్రావెల్‌ వార్నింగ్‌

ఒమన్‌ సహా పలు దేశాలు భారత్‌, పాకిస్తాన్‌ దేశాలకు వెళ్ళే తమ పౌరులకు ట్రావెల్‌ వార్నింగ్‌ జారీ చేశాయి. ప్రధానంగా పాకిస్తాన్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్ళడం క్షేమం కాదంటూ పలు అరబ్‌ దేశాలు ట్రావెల్‌ వార్నింగ్‌ జారీ చేయడం గమనార్హం. ఒమన్‌ తప్ప, వేరే అరబ్‌ దేశం ఏదీ ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు ట్రావెల్‌ వార్నింగ్‌ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే భారత్‌ - పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం ముదురుతుండడంతో భారత్‌కి సైతం ట్రావెల్‌ వార్నింగ్‌ జారీ చేసే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌, పాక్‌లలో వున్న పౌరులు సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని ఆయా దేశాలు తమ పౌరులకు సూచిస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com