అబుధాబి కి సుష్మ స్వరాజ్ వస్తే మేము రాము అంటున్న పాక్
- February 28, 2019దుబాయ్: వచ్చే నెలలో ఇస్లామిక్ సహకార సంస్థ (ఐవోసీ) సమావేశానికి భారత్ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరైన పక్షంలో తాము ఈ సదస్సును బహిష్కరిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించారు. ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్ను గౌరవ అతిథిగా ఆహ్వానించారు. ఈ సమావేశం మార్చి 1,2 తేదీల్లో అబూదాబీలో జరుగుతుంది. తమకు ఇస్లామిక్ దేశం, లేదా ఐవోసీలో విబేధాలు లేవని ఖురేషీ చెప్పారు. కాని ఈ సమావేశానికి సుష్మాస్వరాజ్ హాజరు కావడాన్ని నిరసిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరస్, టర్కీ విదేశాంగ శాఖ మంత్రి మేవ్లుట్ కేవ్సోగ్లుకు తెలియచేసినట్లు చెప్పారు. ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్ ఎందుకు హాజరవుతున్నారో తెలియడం లేదన్నారు. ఈ విషయమై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధికి తెలియచేసినట్లు ఆయన చెప్పారు. కాగా పాకిస్తాన్, ఇండియా సంయమనంతో ఉండాలని ఓఐసీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఇరుదేశాలు జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్