అబుధాబి కి సుష్మ స్వరాజ్ వస్తే మేము రాము అంటున్న పాక్
- February 28, 2019
దుబాయ్: వచ్చే నెలలో ఇస్లామిక్ సహకార సంస్థ (ఐవోసీ) సమావేశానికి భారత్ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరైన పక్షంలో తాము ఈ సదస్సును బహిష్కరిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించారు. ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్ను గౌరవ అతిథిగా ఆహ్వానించారు. ఈ సమావేశం మార్చి 1,2 తేదీల్లో అబూదాబీలో జరుగుతుంది. తమకు ఇస్లామిక్ దేశం, లేదా ఐవోసీలో విబేధాలు లేవని ఖురేషీ చెప్పారు. కాని ఈ సమావేశానికి సుష్మాస్వరాజ్ హాజరు కావడాన్ని నిరసిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరస్, టర్కీ విదేశాంగ శాఖ మంత్రి మేవ్లుట్ కేవ్సోగ్లుకు తెలియచేసినట్లు చెప్పారు. ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్ ఎందుకు హాజరవుతున్నారో తెలియడం లేదన్నారు. ఈ విషయమై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధికి తెలియచేసినట్లు ఆయన చెప్పారు. కాగా పాకిస్తాన్, ఇండియా సంయమనంతో ఉండాలని ఓఐసీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఇరుదేశాలు జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









