ఆర్మీ 'మేజర్ 'గా అడవిశేషు..నిర్మాతగా మెష్ బాబు
- February 28, 2019
టాలీవుడ్ లో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్న అడవిశేషు..ఇటీవల గూఢచారి సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఈ తరహా సినిమా రావడంతో ఆడియన్స్ కొత్తగా ఫీల్ కావడం..సినిమా మంచి హిట్ అయ్యేందుకు దోహదపడింది. శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అడివి శేష్ కెరీర్ లోనే ఉత్తమ సినిమాగా నిలిచింది. ఈ సారి 'మేజర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు అడవి శేషు.
26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ ఇన్స్పిరేషన్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కూడా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి. అడివి ఎంటర్ టైన్ మెంట్, శరత్ చంద్ర, ఎ+జి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఈ సినిమా రెండు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. 2020లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ అడవిశేషు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పోస్టర్ చూస్తుంటే మరో హిట్ కొట్టేలా ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









