ఆర్మీ 'మేజర్ 'గా అడవిశేషు..నిర్మాతగా మెష్ బాబు
- February 28, 2019టాలీవుడ్ లో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్న అడవిశేషు..ఇటీవల గూఢచారి సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఈ తరహా సినిమా రావడంతో ఆడియన్స్ కొత్తగా ఫీల్ కావడం..సినిమా మంచి హిట్ అయ్యేందుకు దోహదపడింది. శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అడివి శేష్ కెరీర్ లోనే ఉత్తమ సినిమాగా నిలిచింది. ఈ సారి 'మేజర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు అడవి శేషు.
26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ ఇన్స్పిరేషన్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కూడా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి. అడివి ఎంటర్ టైన్ మెంట్, శరత్ చంద్ర, ఎ+జి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఈ సినిమా రెండు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. 2020లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ అడవిశేషు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పోస్టర్ చూస్తుంటే మరో హిట్ కొట్టేలా ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి