ఫ్లైట్ ఎస్కార్ట్స్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం
- March 15, 2019
విమానాల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి) ఏర్పాటు చేసిన ఎస్కార్ట్స్ ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తాజాగా హైద్రాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో బారీ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ని అధికారులు భగ్నం చేశారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఆర్జిఐఏతోపాటు ఎస్కార్ట్ టీమ్స్ విమానాల్లో మోహరించి, ప్రయాణీకుల్ని పరిశీలిస్తారు. ప్రత్యేకించి దుబాయ్ నుంచి వచ్చేవారి పట్ల ఈ ఎస్కార్ట్స్ అప్రమత్తంగా వ్యవహరిస్తారు. బ్యాగ్లను ఎక్స్ఛేంజ్ చేసుకునేవారిపై దృష్టిపెట్టి, అదుపులోకి తీసుకుంటున్నారు. కస్టమ్స్ కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్కార్ట్స్ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తారని చెప్పారు. కొత్త ఎస్కార్ట్స్ విధానం సత్ఫలితాలనిస్తోందనీ, స్మగ్లింగ్ రాకెట్స్ని భగ్నం చేయగలుగుతున్నామనీ ఎస్కార్ట్స్ కళ్ళు గప్పి తప్పించుకోవడం అసాధ్యమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









