వరల్డ్ మ్యాప్లను ధ్వంసం చేస్తున్న చైనా
- April 04, 2019
ఉరుమురుమి మంగళం మీద పడ్డట్లుగా తయారైంది ప్రపంచ పటాల పరిస్థితి. చైనా కోపం వరల్డ్ మ్యాప్లకు ముప్పు తెచ్చి పెట్టింది. ప్రపంచ పటాలపై చైనాకు ఎందు కంత కోపం అనేదే మీ డౌట్ కదా! అదంతే. చైనాకు కోపమొస్తే వరల్డ్ మ్యాప్లు కూడా మాడి మసి కావాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. గత నెలలో 30 వేల ప్రపంచ పటాలను నాశనం చేసిన చైనా, ఇప్పుడు ఏకంగా 3 లక్షల ప్రపంచ పటాలను ధ్వంసం చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఆదేశించడంతో అధికార యంత్రాంగం మొత్తం వరల్డ్ మ్యాప్లు తొలగించడంపై దృష్టి సారించింది.
ఇంతకీ ప్రపంచ పటాలపై చైనాకు ఎందుకంత మంట అంటే… ఇతర దేశాల భూభాగాలను తనవిగా చెప్పుకోవడం చైనాకు అలవాటు. మనదేశంలోని అరుణాచల్ప్రదేశ్తో పాటు టిబెట్, తైవాన్ సహా పలు ప్రాంతాలను తమ భూభాగా లుగా చైనా ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. దాంతో భౌగోళిక సరిహద్దుల విషయంలో పరిసర దేశాలతో వివా దాలు నడుస్తున్నాయి. ఫలితంగా చైనా అధికారులు ప్రభుత్వ సూచనల మేరకు మ్యాప్లను ఎప్పటికప్పుడు పరిశీ లించి మార్పులు-చేర్పులు చేస్తూ ఉంటారు. తాజాగా గాంగ్డాంగ్ ప్రావిన్స్లోని వెంజిండు పోర్టులో భారీగా ప్రపంచ పటాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెదర్లాండ్స్కు తరలించేందుకు సిద్ధం చేసిన ఆ మ్యాప్ల ను పరిశీలిస్తే, అందులో అరుణాచల్ ప్రదేశ్ భారత్ భూభాగంగా ఉండగా, తైవాన్ స్వతంత్ర దేశంగా ఉంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు మ్యాప్లను ముద్రించిన సంస్థపై దాడి చేశారు.
చైనా అధికారులు మొత్తం 3 లక్షల 6 వేల మ్యాప్లను గుర్తించారు. ఆ పటాలు, ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఉండడంతో వెంటనే ధ్వంసం చేయాలని ఆదేశించారు. అలాగే ప్రపంచ పటాలను ముద్రించిన సంస్థపై దావా వేయాలని నిర్ణయించారు. మార్చ్ నెలలో క్వింగ్డో పట్టణంలోని ఓ కంపెనీపై దాడి చేసిన కస్టమ్స్ అధికారులు సుమారు 29 వేల మ్యాప్లను ధ్వంసం చేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







