విదేశాల నుంచి ఇండియాకు నగదు.. రికార్డు సృష్టించిన భారత్..
- April 09, 2019విదేశాల నుంచి భారత్కు నగదు పంపే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2018లో వివిధ దేశాల నుంచి 79 బిలియన్ డాలర్లు భారత్కు చేరినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక తెలిపింది. దీంతో డాలర్ల రూపంలో అత్యధికంగా జమ అయిన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. భారత్ తర్వాత 67 బిలియన్ డాలర్లతో చైనా, మెక్సికో 36 బిలియన్ డాలర్లతో మూడోస్థానంలోనూ, ఫిలిప్పీన్స్ 34 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. 29 బిలియన్ డాలర్లతో ఈజిప్టు ఐదో ప్లేస్ లో ఉంది.
గత మూడేళ్లుగా డాలర్ల రూపంలో భారత్కు వస్తున్న నగదు పెరుగుతోంది. 2016లో 62.7 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2017 నాటికి ఆ మొత్తం 65.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2018లో ఏకంగా 79 బిలియన్ డాలర్లకు చేరింది. విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య 14శాతం పెరిగినట్టు నివేదిక లెక్కలేసింది. కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన తమ వారిని ఆదుకునేందుకు అనేక మంది పెద్ద మొత్తంలో సొమ్మును భారత్కు పంపారు ఇది కూడా పెరగడానికి ఓ కారణమని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
మరోపక్క పొరుగుదేశం పాకిస్థాన్కు విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య కేవలం 7శాతం మాత్రమే. తక్కువ, మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాలకు 2017లో 483 బిలియన్ డాలర్లు వచ్చి చేరగా, 2018లో 9.6శాతం వృద్ధి రేటుతో అత్యధికంగా 529 బిలియన్ డాలర్లు జమ అయినట్టు తెలుస్తోంది. అత్యధిక ఆదాయం కలిగిన దేశాల్లో ఇది 633 బిలియన్ డాలర్ల నుంచి 689 బిలియన్ డాలర్లకు పెరిగింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..