హైదరాబాద్:డ్రోన్ పైలెట్లకు శిక్షణ..
- April 09, 2019హైదరాబాద్:గత మూడు నాలుగు సంవత్సరాలనుంచి డ్రోన్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ముఖ్యంగా డ్రోన్ కెమెరాల గురించి తరచుగా వింటూ ఉన్నాము. ఇప్పటి వరకు అంతగా వినియోగంలో లేని డ్రోన్ కెమెరాల వాడకానికి అధికారిక ఆమోదం లభించడంతో ఊపందుకుంది. హైదరాబాదుకు చెందిన ఐటీ సంస్థ ‘సైయెంట్’ నగరంలో రిమోట్ పైలట్ (డ్రోన్ పైలట్) శిక్షణను ఇవ్వనుంది. ఇందుకు గాను ఆ సంస్థ సోమవారం తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎస్ఏఏ), తెలంగాణ ప్రభుత్వంతో కలిసి త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలట్ల శిక్షణకు అవసరమైన పరికరాలను, సిమిలేషన్ సౌకర్యాలను ఐటీ సంస్థ ‘సైయెంట్’ అందించనుంది. టీఎస్ఏఏ సంస్థ ఇందుకు అవసరమైన మౌలిక వసతులను, శిక్షణ సేవలను అందించనుంది. శిక్షణకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిపుణులైన డ్రోన్ పైలట్లను తయారు చేయడమే ధ్యేయంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. వివిధ రకాల రోటరీ, ఫిక్స్డ్ వింగ్ డ్రోన్ల గురించి సిమిలేటర్లపై శిక్షణ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన