హైదరాబాద్:డ్రోన్ పైలెట్లకు శిక్షణ..

- April 09, 2019 , by Maagulf
హైదరాబాద్:డ్రోన్ పైలెట్లకు శిక్షణ..

హైదరాబాద్:గత మూడు నాలుగు సంవత్సరాలనుంచి డ్రోన్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ముఖ్యంగా డ్రోన్ కెమెరాల గురించి తరచుగా వింటూ ఉన్నాము. ఇప్పటి వరకు అంతగా వినియోగంలో లేని డ్రోన్ కెమెరాల వాడకానికి అధికారిక ఆమోదం లభించడంతో ఊపందుకుంది. హైదరాబాదుకు చెందిన ఐటీ సంస్థ ‘సైయెంట్’ నగరంలో రిమోట్ పైలట్ (డ్రోన్ పైలట్) శిక్షణను ఇవ్వనుంది. ఇందుకు గాను ఆ సంస్థ సోమవారం తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ), తెలంగాణ ప్రభుత్వంతో కలిసి త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలట్ల శిక్షణకు అవసరమైన పరికరాలను, సిమిలేషన్ సౌకర్యాలను ఐటీ సంస్థ ‘సైయెంట్’ అందించనుంది. టీఎస్‌ఏఏ సంస్థ ఇందుకు అవసరమైన మౌలిక వసతులను, శిక్షణ సేవలను అందించనుంది. శిక్షణకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిపుణులైన డ్రోన్ పైలట్లను తయారు చేయడమే ధ్యేయంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. వివిధ రకాల రోటరీ, ఫిక్స్‌డ్ వింగ్ డ్రోన్ల గురించి సిమిలేటర్లపై శిక్షణ ఇవ్వనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com