విద్యార్థుల అస్వస్థతో దుబాయ్ స్కూల్కి రెండు రోజుల సెలవు
- April 11, 2019దుబాయ్ స్కూల్, విద్యార్థుల అనారోగ్యం కారణంగా రెండు రోజులు మూతపడింది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నారు. దుబాయ్లోని అల్ గర్హౌద్లో గల కిండర్గార్టెన్ స్టార్టర్స్, తమ విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ సెలవుల విషయమై సమాచారం అందించింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో స్కూల్ని మూసివేసి, డీప్ క్లీన్ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్ మునిసిపాలిటీ మరియు దుబాయ్ హెల్త్ అథారిటీ ఈ స్కూల్ని ఇప్పటికే సందర్శించడం జరిగింది. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీకి సైతం సమాచారం ఇచ్చారు. వివిధ క్లాసులకు చెందిన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, తమ పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తాయనీ వాంతులు, జ్వరంతో వారు బాధపడుతున్నారనీ ఫిర్యాదు చేయడంతో స్కూల్ యాజమాన్యం ఈ చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం