ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ ముప్పు హెచ్చరిక

- April 21, 2019 , by Maagulf
ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ ముప్పు హెచ్చరిక

ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ అటాక్ ప్రమాద హెచ్చరిక!! ఈ మేరకు క్రెబ్స్ఆన్‌సెక్యూరిటీ ఫౌండర్ బ్రియాన్ క్రెబ్స్ ఈ మేరకు అలర్ట్ చేశారు. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పు ఉందని ఈ సైబర్‌సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ వెబ్‌సైట్ క్రెబ్స్‌ఆన్‌సెక్యూరిటీడాట్‌కామ్ చెబుతోంది. బ్రియాన్ క్రెబ్స్ వాషింగ్టన్ పోస్ట్ మాజీ ఉద్యోగి, సైబర్ సెక్యూరిటీ రైటర్. ఈయన ఆధ్వర్యంలో ఈ వెబ్‌సైట్ నడుస్తోంది.

విప్రోలాగా ఇన్ఫోసిస్, క్యాప్ జెమినిలు టార్గెట్ ఈ రిపోర్ట్స్ ప్రకారం విప్రోలాగా ఇన్ఫోసిస్, క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్ వంటి పలు ప్రధాన సంస్థలను సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేయాలని చూస్తున్నారు. వీటితో పాటు రిటైల్, ఫైనాన్షియల్, కన్సల్టింగ్ కంపెనీస్‌ను కూడా అప్రమత్తం చేశారు. సైబర్ అటాకర్స్ గిఫ్ట్ కార్డు రూపంలో ఫ్రాడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నరని బ్రియాన్ క్రెబ్స్ పేర్కొన్నారు. కాగా, తమ ఉద్యోగుల్లో కొందరి ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ఇప్పటికే విప్రో అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో క్యాప్‌జెమినీ సైతం ఇదే తరహా దాడులను గుర్తించామని పేర్కొంది. అదే సమయంలో నివారణ చర్యలు తీసుకున్నామని, దీంతో ఎలాంటి నష్టం లేదని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com