బంపర్ ఆఫర్తో జియో గిగాఫైబర్..
- April 24, 2019టెలికం దిగ్గజం జియో మరో సంచలనానికి సిద్ధమైంది. మార్కెట్లో జియో సృష్టించిన పేరును గుర్తుంచుకునేందుకు మరో అద్భుత సేవను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జియో గిగాఫైబర్ కింద బ్రాండ్బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్లైన్ సేవలన్నింటినీ అందిస్తామని కంపెనీ గతంలోనే తెలిపింది. ప్రస్తుతం రిలయెన్స్ గిగాఫైబర్ను ప్రయోగాత్మకంగా పలుచోట్ల పరిశీలిస్తుంది.
ఇంకా అధికారికంగా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైలో గిగాఫైబర్ వన్టైమ్ డిపాజిట్ కింద రూటర్ కోసం రూ.4,500 తీసుకుని, 100 గిగాబైట్స్ డేటాను 100 ఎంబీపీఎస్ వేగంతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తూ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. రిలయెన్స్ జియో గిగాఫైబర్ మొదట 29 పట్టణాల్లో ప్రారంభం కానుందని.. అందులో ముఖ్యంగా న్యూఢిల్లీ, ముంబైలో మొదటి దశలో ఉంటుందని తెలుస్తోంది. జియో గిగాఫైబర్ సేవలు మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన