సౌదీ అరేబియా లో 37 మంది ఉగ్రవాదులకు మరణదండన
- April 24, 2019సౌదీ అరేబియా: ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనే అభియోగాలపై సౌదీ అరేబియా మంగళవారం 37 మందికి సామూహిక మరణదండన అమలుచేసింది. రియాద్తోపాటు మక్కా, మదీన, కాసిం, తూర్పు ప్రావిన్సులో ఈ శిక్షలు అమలుపరిచింది. శాంతిభద్రతలను అస్థిరపరిచేందుకు ఉగ్రవాద చర్యలకు పాల్పడినందుకు వీరికి మరణశిక్ష విధించినట్లు అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ(ఎస్పీఏ) వెల్లడించింది. మరణశిక్ష అనంతరం ఓ వ్యక్తికి శిలువ వేసినట్లు తెలిపింది. తీవ్రమైన నేరానికి పాల్పడిన వారికి ఈ శిక్ష విధిస్తారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 100 మందికి మరణదండన విధించినట్లు ఎస్పీఏ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..