బంపర్ ఆఫర్తో జియో గిగాఫైబర్..
- April 24, 2019టెలికం దిగ్గజం జియో మరో సంచలనానికి సిద్ధమైంది. మార్కెట్లో జియో సృష్టించిన పేరును గుర్తుంచుకునేందుకు మరో అద్భుత సేవను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జియో గిగాఫైబర్ కింద బ్రాండ్బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్లైన్ సేవలన్నింటినీ అందిస్తామని కంపెనీ గతంలోనే తెలిపింది. ప్రస్తుతం రిలయెన్స్ గిగాఫైబర్ను ప్రయోగాత్మకంగా పలుచోట్ల పరిశీలిస్తుంది.
ఇంకా అధికారికంగా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైలో గిగాఫైబర్ వన్టైమ్ డిపాజిట్ కింద రూటర్ కోసం రూ.4,500 తీసుకుని, 100 గిగాబైట్స్ డేటాను 100 ఎంబీపీఎస్ వేగంతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తూ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. రిలయెన్స్ జియో గిగాఫైబర్ మొదట 29 పట్టణాల్లో ప్రారంభం కానుందని.. అందులో ముఖ్యంగా న్యూఢిల్లీ, ముంబైలో మొదటి దశలో ఉంటుందని తెలుస్తోంది. జియో గిగాఫైబర్ సేవలు మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు