హైదరాబాద్ లో హీరా గ్రూప్పై కేసు నమోదు
- April 26, 2019
హైదరాబాద్:వేల కోట్ల స్కామ్కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. నౌహీరా షేక్ దాదాపు రూ.5700 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. హీరా గ్రూప్పై కేసు నమోదు చేసిన ఈడీ. హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నాంపల్లి కోర్టులో ట్రాన్సిట్ వారంట్ను ఈడీ దాఖలు చేసింది. కాగా, ప్రస్తుతం హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ చంచల్గూడ జైల్లో ఉన్నారు. విదేశీ నిధుల పెట్టుబడులు, సేవలపై ఆరా తీయాలని ఈడీ భావిస్తోంది. అధిక వడ్డీ ఆశ చూపించి అమాయకులను మోసం చేసినట్టు నౌహిరా గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మైనార్టీలకు అండగా నిలుస్తామంటూ ఆ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డట్టు బాధితులు గతంలో ఆఫీసుల ముందు ధర్నాలు చేశారు. ఫైనాన్స్, గోల్డ్ స్కీమ్లలో తామంతా మోసపోయినట్టు వందల మంది నిరసనలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







