రమదాన్: 500కి పైగా కన్స్యుమర్ గూడ్స్ ధరల తగ్గింపు
- April 26, 2019
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ ఇండస్ట్రీ, 500కి పైగా కమోడిటీస్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పవిత్ర రమదాన్ నేపథ్యంలో ఈ ధరల తగ్గింపుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రముఖ సూపర్ మార్కెట్స్తో కలిసి తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో ధరలు నేటి నుంచి తగ్గుతాయి. ఈ తగ్గుదల రమదాన్ పూర్తయ్యేవరకు అమల్లో వుంటుంది. తగ్గిన ధరల ప్రకారం బలాద్నా మిల్క్ 1 లీటర్ 5 ఖతారీ రియాల్స్కి దొరుకుతుంది. 800 గ్రాముల అల్ వహా ఫ్రశ్రీష్ చికెన్ 13.25 ఖతారీ రియాల్స్. ఫ్రోజెన్ హోల్ చికెన్ 1 కిలో 11 ఖతారీ రియాల్స్. పంజాబీ గార్డెన్ బాస్మతీ రైస్ 29 ఖతారీ రియాల్స్కి ఐదు కేజీలు లభ్యమవుతాయి. రమదాన్ సందర్భంగా కమోడిటీస్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లయర్స్తో కమ్యూనికేట్ చేసినట్లు మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







