హైదరాబాద్ లో హీరా గ్రూప్పై కేసు నమోదు
- April 26, 2019
హైదరాబాద్:వేల కోట్ల స్కామ్కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. నౌహీరా షేక్ దాదాపు రూ.5700 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. హీరా గ్రూప్పై కేసు నమోదు చేసిన ఈడీ. హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నాంపల్లి కోర్టులో ట్రాన్సిట్ వారంట్ను ఈడీ దాఖలు చేసింది. కాగా, ప్రస్తుతం హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ చంచల్గూడ జైల్లో ఉన్నారు. విదేశీ నిధుల పెట్టుబడులు, సేవలపై ఆరా తీయాలని ఈడీ భావిస్తోంది. అధిక వడ్డీ ఆశ చూపించి అమాయకులను మోసం చేసినట్టు నౌహిరా గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మైనార్టీలకు అండగా నిలుస్తామంటూ ఆ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డట్టు బాధితులు గతంలో ఆఫీసుల ముందు ధర్నాలు చేశారు. ఫైనాన్స్, గోల్డ్ స్కీమ్లలో తామంతా మోసపోయినట్టు వందల మంది నిరసనలు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







