బంగారం తళుకులు తగ్గాయి
- January 01, 2016
ఏడాది చివరి రోజు దేశీయ మార్కెట్లో బంగారం తళుకులు తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర 25,000 రూపాయల దిగువకు జారింది. స్టాకిస్టులు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో వరుసగా మూడో ఏడాదిలోనూ పసిడి ధర క్షీణతనే చవిచూసింది. ఏడాదిలో పసిడి ధర 1,740 రూపాయలు (6.51 శాతం) మేర తగ్గిపోయింది. ఇక వరుసగా ఐదో రోజూ వెండి ధర క్షీణించింది. ముంబై మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర గురువారం 175 రూపాయలు తగ్గి 24,980 రూపాయలకు చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి 25,130 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 95 రూపాయల నష్టంతో 33,565 రూపాయలకు క్షీణించింది. 2014తో పోల్చితే 2015 సంవత్సరంలో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర 6.51 శాతం, ప్యూర్ బంగారం ధర 6.48 శాతం, వెండి ధర 9.78 శాతం క్షీణించింది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









